చెర్రీ నెక్ట్స్ సినిమా ఏంటీ..? శంకర్ సినిమా చేస్తున్నారు. మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యారు. అయితే అసలు చిక్కు ఇక్కడే వచ్చి పడింది. ఆర్సీ 15 తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారు..?
రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రజెంట్ శంకర్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నారు. మరో రెండు మూడు నెలల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఈ సినిమా తర్వాత ఇద్దరు నిర్మాతలతో సినిమాకు కమిట్ అయ్యారు రామ్ చరణ్. యూవీ క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్ కి డేట్స్ ఇచ్చేశారు ఈ మెగా హీరో.
ఈ ఇద్దరీలో ఏ సినిమా ముందు చేస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి ముందుగా యూవీ వారి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. కానీ ఎందుకో తెలియదు కానీ… ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం వెనక్కి వెళ్తింది. దీంతో సీన్ లోకి ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు వచ్చారు. ఈ నేపధ్యంలో ఆర్సీ 15 మూవీ రిలీజ్ కూడా చూసుకొని…నవంబర్ లో బుచ్చిబాబు సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి రామ్ చరణ్ ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.