*భారత్ లో ట్విట్టర్ ఆఫీస్ లు బంద్
ట్విట్టర్ సంస్థలో వ్యయాలు తగ్గించుకోవాలన్న ఎలాన్ మస్క్ అభిమతానికి అనుగుణంగా భారత్లో ట్విట్టర్కున్న రెండు కార్యాలయాలను మూసివేశారు. న్యూఢిల్లీ, ముంబై నగరాల్లోని ఆఫీసులను మూసివేయగా.. బెంగళూరు కార్యాలయం ప్రస్తుతం యథాతథంగా కొనసాగుతోంది. ట్విట్టర్ గతేడాది ఇండియాలో సుమారు 200 మంది సిబ్బందిని తొలగించిన విషయం తెలిసిందే. సంస్థ మొత్తం సిబ్బందిలో వీరి వాటా సుమారు 90 శాతమని ఓ అంచనా. ఇక బెంగళూరు శాఖలోని సిబ్బందిలో అత్యధికులు సాఫ్ట్వేర్ ఇంజినీర్లేనని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

*ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగానే ఆఫీస్ మూసివేత
టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉద్యోగులను తొలగించడం నుంచి.. మొన్న తన పెంపుడు కుక్కను సీఈఓగా ప్రకటించడం వరకూ.. మస్క్ నిర్ణయాలు నెటిజన్లను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ట్విట్టర్లో ఖర్చులు తగ్గించుకునే దిశగా.. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న మస్క్ తాజాగా భారత్ లో రెండు ట్విట్టర్ కార్యాలయాలను క్లోస్ చేశాడు. ఢిల్లీ, ముంబై నగరాల్లోని ఆఫీసులను మూసివేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఒకేఒక్క కార్యాలయం విధులు నిర్వర్తిస్తోంది.

*బెంగళూరు మినహా..న్యూఢిల్లీ, ముంబై ఆఫీలు క్లోజ్
ఇండియాలో ఉన్న మూడు ఆఫీసుల్లో రెండింటిని క్లోజ్ చేసినట్లు సమాచారం. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబైలోని ట్విట్టర్ ఆఫీసులను మూసివేసినట్లు తెలుస్తోంది. ఆయా ఆఫీసుల్లో పనిచేస్తున్న సిబ్బందికి వర్క్ ఫ్రం హోం ఇచ్చినట్లు సమాచారం. కాస్ట్ కట్టింగ్ లో భాగంగానే మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. ట్విట్టర్ను చేజిక్కించుకున్నాక మస్క్.. సంస్థను లాభాల బాట పట్టించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. 2023 కల్లా సంస్థకు ఆర్థిక స్థిరత్వం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది ఇండియాలో సుమారు 200 మంది సిబ్బందిని ఎలాన్ మస్క్ తొలగించారు. సంస్థ మొత్తం సిబ్బందిలో వీరి వాటా సుమారు 90 శాతం ఉంటుందని సమాచారం. బెంగళూరు శాఖలోని సిబ్బందిలో అత్యధికులు సాఫ్ట్వేర్ ఇంజినీర్లేనని తెలుస్తోంది. భారత్ లో ట్విట్టర్ వాడుతున్న ప్రముఖులందరిలోకెల్లా ప్రధాని మోదీకే ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నారు. ఆయనను ఏకంగా 86.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.