గల్వాన్ కేంద్రంగా .. చైనా, భారత్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయా..? ఈ తరుణంలో .. గాల్వాన్ లోయలో .. భారత సైనికులు .. చేపడుతోన్న కార్యక్రమాలు .. మరింత కాక రేపుతున్నాయా..? భారత సైనికుల దూకుడు .. చైనాకు వార్నింగ్ ఇస్తున్నట్లేనా.. దీంతో .. భారత్, చైనా మధ్య సంబంధాలపై ప్రభావం చూపనుందా..? అసలు గాల్వాన్ ఘటనే .. ఈ ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయా..?
గాల్వాన్ లోయ సమీపంలో భారత సైన్యం నిర్మాణాలు, నిఘా కార్యకలాపాలను వేగవంతం చేసింది. లోయలో గుర్రాలపై పెట్రోలింగ్ చేపట్టింది. దీనికి సంబంధించిన వీడియోను ఏఎన్ఐ వార్తా సంస్థ షేర్ చేసింది. గడ్డుకట్టుకుపోయే చలిని సైతం లెక్కచేయకుండా వాస్తవాధీన రేఖ వెంబడి పెట్రోలింగ్ పాయింట్స్ వద్ద గుర్రాలపై సైనికులు పహారా కాస్తూ నదిని దాటడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఇప్పటికే గల్వాన్ లోయలో భారత సైనికులు క్రికెట్ ఆడుతున్న ఫోటోలను ఇండియన్ ఆర్మీ షేర్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా, ఈ వీడియో బయటకు వచ్చింది. గాల్వాన్ లోయ సమీపంలో మోహరించిన భారత సైన్యం ఇటీవలి నెలల్లో గుర్రాలు, పోనీలపై వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉన్న ప్రాంతాలను సర్వే చేయడం, ఘనీభవించిన పాంగాంగ్ సరస్సుపై హాఫ్ మారథాన్ వంటి కార్యకలాపాలను చేపట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.తూర్పు లడఖ్లోని గాల్వాన్ లోయలో 2020 జూన్ 15న భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 20 మందికిపైగా భారత సైనికులు అమరులయ్యారు. అటు, చైనాకు సైతం పెద్ద సంఖ్యలో నష్టం జరిగింది.
బయటకు చెబితే పరువు పోతుందని తమ సైనికులెవరూ చనిపోలేదని డ్రాగన్ బుకాయించింది. కానీ, అంతర్జాతీయ నివేదికలు, మీడియా మాత్రం 40 మందికిపైగా చైనా సైనికులు గాల్వాన్ లోయ ఘర్షణల్లో చనిపోయినట్టు పేర్కొన్నాయి. ఘటన తర్వాత భారత్, చైనాలు ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్చలు, దౌత్యమార్గాలను అనుసరించాయి. కార్ప్స్ కమాండర్ స్థాయిలో 17 రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ.. ఇరు దేశాలూ పరస్పర అంగీకరానికి రాలేదు. ఉద్రిక్తతలు తలెత్తిన ప్రాంతాల నుంచి పాక్షికంగా సైన్యాలను వెనక్కి మళ్లించాయి.
ఘర్షణ జరిగిన పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద ప్రస్తుతం పెట్రోలింగ్ చేపట్టడం లేదు. కానీ ఇప్పటికీ ఆ ప్రాంతానికి దగ్గరగా పెద్ద సంఖ్యలో చైనా సైనికులు ఉంటున్నారు. ఇదే సమయంలో తాము గాల్వన్లోకి తిరిగి అడుగుపెట్టామని గతేడాది జనవరి 1న చైనా సైన్యం ఓ వీడియోను పోస్టు చేసింది. కానీ అది ఘర్షణలు జరిగిన ప్రాంతానికి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉన్న వీడియోగా గుర్తించారు. చైనా సైన్యం కదలికలను గమనించడం కోసం భారత సైన్యం తాజాగా ఎల్ఏసీ సమీపంలో పెట్రోలింగ్ను ప్రారంభించింది.
ఘర్షణ తలెత్తిన ప్రాంతానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో.. గడ్డ కట్టించే చలిలో.. 14 వేల అడుగుల ఎత్తులో భారత జవాన్లు క్రికెట్ ఆడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాటియాలా బ్రిగేడ్కు చెందిన త్రిశూల్ డివిజన్ అత్యంత ఎత్తయిన, అతి శీతల ప్రాంతంలో ఈ క్రికెట్ పోటీలను నిర్వహించిందని ఆర్మీకి చెందిన 14 కార్ప్స్ వెల్లడించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తామని 14 కార్ప్స్ వెల్లడించింది. గాల్వాన్ లోయ.. ఈ పేరు వినగానే భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు గుర్తొస్తాయి. 2020 జూన్ 15, 16 తేదీల్లో జరిగిన కొట్లాటలో 21 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందగా.. చైనా సైన్యానికి సైతం పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది.
బుల్లెట్ పేల్చొద్దనే నిబంధనను పాటిస్తూనే.. ముళ్ల కర్రలతో చైనా సైన్యం దొంగ దెబ్బతీయాలని ప్రయత్నించగా.. ఇండియన్ ఆర్మీ దీటుగా బదులిచ్చిన సంగతి తెలిసిందే.అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. భారత్, చైనా సైనికాధికారుల మధ్య ఇప్పటికీ ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇటీవలే ఢిల్లీలో జీ20 సదస్సులో భాగంగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్.. చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్తో చర్చలు జరిపారు.
ఇరు దేశాల మధ్య సంబంధాలు అసాధారణంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ భేటీ ముగిసిన కొద్ది గంటల్లోనే గాల్వాన్ లోయకు అతి చేరువగా.. భారత సైనికులు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న ఫొటోలను ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది. ఈ క్రికెట్ మ్యాచ్ను ఎక్కడ నిర్వహించారనే విషయాన్ని ఇండియన్ ఆర్మీ కచ్చితంగా వెల్లడించలేదు. కానీ పెట్రోల్ పాయింట్ 14కు 4 కిలోమీటర్ల దూరంలో ఈ మ్యాచ్ జరిగిందని తెలుస్తోంది. గాల్వాన్ ఘర్షణలు ఈ పాయింట్ దగ్గరే చోటు చేసుకున్నాయి. ఘర్షణల అనంతరం ఇరు దేశాల సైన్యం అక్కడి నుంచి 1.5 కిలోమీటర్లు వెనక్కి వెళ్లాయి.
దాన్ని బఫర్ జోన్గా మార్చారు. భారత సైన్యం 700 మీటర్లు వెనక్కి వెళ్లగా, తొలి క్యాంప్ 700 మీటర్ల వెనుక ఉంది. రెండో క్యాంప్, మూడో క్యాంప్ దాదాపు అంతే దూరంలో ఉన్నాయి. అక్కడి నుంచి చైనా సైన్యం కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. ఘర్షణలు తలెత్తిన పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద ఇప్పుడుపెట్రోలింగ్ చేపట్టడం లేదు. కానీ ఇప్పటికీ ఆ ప్రాంతానికి చేరువలోనే పెద్ద సంఖ్యలో చైనా సైనికులు ఉంటున్నారు. దీంతో చైనా కార్యకలపాలనుగమనించడం కోసం ఆ ప్రాంతంపై నిఘా పెట్టడం మాత్రం తప్పనిసరి. తాము గాల్వన్లోకి తిరిగి అడుగుపెట్టామని 2022 జనవరి 1న చైనా సైన్యం ఓవీడియోను పోస్టు చేసింది. కానీ అది ఘర్షణలు జరిగిన ప్రాంతానికి దాదాపు 1.5 కిలోమీటర్ దూరంలో తీసిన వీడియోగా గుర్తించారు. కార్ప్స్ కమాండర్ స్థాయిలో 17 రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ.. ఇరు దేశాల మధ్య చర్చలు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఉద్రిక్తతలు తలెత్తిన ప్రాంతాల నుంచి పాక్షికంగా సైన్యాలను వెనక్కి మళ్లించారు. కానీ కొన్ని ప్రాంతాల విషయంలో మాత్రం ఇప్పటికీ చైనా బెట్టు చేస్తూనే ఉంది. ఇరు దేశాలు సరిహద్దులకు చేరువగా సైనిక మోహరింపును పెంచుతూ.. మైండ్ గేమ్స్ ఆడుతున్నాయి.