Homeఅంతర్జాతీయంఇదొక వింత పరిణామం..కెన్యాలో పక్షులపై యుధ్దం..!

ఇదొక వింత పరిణామం..కెన్యాలో పక్షులపై యుధ్దం..!

కనీసం ఆరు లక్షల పక్షులను చంపాలని నిర్ణియించుకుని అందుకు తగిన చర్యలు మొదలుపెట్టింది. అయితే కెన్యా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని జీవ కారుణ్య సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇదిలా ఉండగా కెన్యా కేవలం ఒక రకం పక్షులపైనే యుధ్దం ప్రకటించడానికి కారణం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

పక్షులపై కెన్యా ప్రభుత్వం యుధ్దం ప్రకటించింది. ఎర్రటి ముక్కుతో చిన్నగా కనిపించే క్యులియా అనే జాతి పక్షి ఆ దేశాన్ని గడగడలాడిస్తోంది. దేశంలోని రైతులకు నేతలకు, ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కేవలం ఈ జాతి పక్షులు దేశంలో ఆహార కరువుకు కారణమవుతున్నాయంటే నమ్మగలరా? కాని ఇది నిజం. అందుకే కెన్యా ప్రభుత్వం వీటిపై యుద్ధం ప్రకటించింది. లక్షల పక్షులను చంపడానికి చర్యలు ప్రారంభించింది. ఒకప్పుడు కరవుతో బాధపడిన కెన్యా దేశాన్ని ఈ పక్షులు తిరిగి ఆ స్థితికి తెస్తాయేమోనన్న ఆందోళన నేతల్లో వ్యక్తమవుతోంది. కెన్యాలో లక్షలాదిగా ఉన్న ఈ పక్షులు వందలాది టన్నుల ఆహార ధాన్యాలను ఆహారంగా ఆరగిస్తూ అటు రైతులను, ఇటు ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నాయి.

ముఖ్యంగా రైతులు పండిస్తున్న గోధుమ, బార్లీ, రైస్‌, సన్‌ఫ్లవర్‌ పంటలపై పడి నాశనం చేస్తున్నాయని గగ్గోలు పెడుతున్నారు. అందుకే అందాలొలికించే ఈ చిట్టి పిట్టను చంపటానికి ఓ దేశ ప్రభుత్వమే కంకణం కట్టుకుంది. ముద్దులొలికే 6 లక్షల పక్షుల్ని చంపటానికి చర్యలు తీసుకుంటోంది కెన్యా దేశ ప్రభుత్వం. చూడగానే ముద్దుచ్చేలా ఉండే ఈ చిట్టి పిట్టలు దేశాన్నే గడగడలాడించడమే అందుకు కారణం. అందుకే కెన్యా ప్రభుత్వం ఆ పక్షుల్ని చంపాలని నిర్ణయించింది. నిజానికి ఆఫ్రికాలో కెన్యా అంటే ఒకప్పుడు కరవు తాండవించి దేశం. కానీ ఇప్పుడు కాస్త ఫరవాలేదనిపించేలా ఎదుగుతోంది. పంటలు కూడా పండుతున్నాయి. అటువంటిదేశాన్ని ఈ పక్షులు గడగడలాడిస్తున్నాయి. దేశ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.

ఆసియా దేశాలలోని వ్యవసాయ క్షేత్రాలపై మిడతలు విరుచుకుపడినట్టే ఈ పక్షులు కూడా వేళా పాళా లేకుండా పంటల్ని తినేస్తున్నాయి.

పంటలపై పడి యదేశ్చగా తినేస్తున్నాయి. వందలాది టన్నుల ఆహార ధాన్యాలను చూస్తుండగానే స్వాహా చేసేస్తున్నాయి.పంటలు వేసిన రైతులు కాపాలాగా ఉండి రాత్రి పగళ్లు కాపలా కాసినా ఫలితం ఉండటంలేదు. నిద్రలేకుండా రైతులు 24గంటలు కాపాలా కాస్తున్నా క్యులియా పక్షుల బెడదనుంచి తప్పించుకోలేకపోతున్నారు. గోధుమ, బార్లీ, రైస్‌, సన్‌ఫ్లవర్‌ పంటలపై పడి నాశనం చేస్తున్నాయని గగ్గోలు పెడుతున్నారు.దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. మరోసారి కరవు కోరల్లో దేశం చిక్కుకోకూదనే యోచనతో ముద్దులొలికే పక్షుల్ని చంపటానికి చర్యలు తీసుకుంటోంది.

ప్రస్తుతం నైరోబీలోని 300 ఎకరాలలో జరుగుతున్న పంట నష్టాన్ని ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ నిపుణులు అంచనా వేసారు. సుమారు 20 లక్షల పక్షులు ఒక్క రోజులో 50 టన్నుల ధాన్యాన్ని స్వాహా చేస్తున్నాయని గుర్తించారు. ఆర్థికపరంగా చూస్తే ఈ పక్షుల వల్ల సంవత్సరానికి 50 మిలియన్ డాలర్ల నష్టం తప్పడం లేదు.
అందుకే యాంటీ క్విలియా డ్రైవ్ అని పక్షులను తరిమేసి నష్టాన్ని నివారించేందుకు నానా రకాలుగా ప్రయత్నాలు చేసారు. కానీ అన్ని సార్లూ విఫలం అయ్యారు. వీటిని తరిమేందుకు ఉపయోగించిన పెస్ట్ కంట్రోల్ స్ప్రేయర్లు మనుషులకు హానికరం అని గుర్తించి ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. ఈ విషయంపై దేశంలో ఆందోళనలు మొదలయ్యాయి. దాంతో ఆ రకం రసాయనాన్ని చల్లడం నిలిపివేసారు.

క్విలియా దండయాత్ర అచ్చం మిడతల దండయాత్ర మాదిరిగానే ఉంటుంది. మిడతలు గాలివాటాన్ని బట్టి వ్యవసాయక్షేత్రాలను కమ్మేస్తుంటాయి.

వాటిని నివారించడం దాదాపు అసాధ్యం అని తేలింది. ఇప్పుడు కెన్యా నైరోబీ ప్రాంతంలో పక్షులు కూడా ఇలాగే మేఘంలా వస్తాయి. క్షణాలలో పంటపొలాలలోని ధాన్యాన్ని మాయం చేస్తాయి. ఆఫ్రికన్ దేశాలలో మాత్రమే పెరిగే ఈ ఎర్రముక్కు పక్షి చేస్తోన్న ఆగడాలు అన్నీ ఇన్నీ కావని వాపోతున్నారు అక్కడి రైతులు. పక్షుల బెడద నుంచి కాపాడుకునేందుకు ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నుంచి 5లక్షల డాలర్లు టాంజానియా ప్రభుత్వానికి అందాయి. మనుషులకు హానికరం కానీ పెస్ట్ కంట్రోల్ ను స్ప్రే చేయడం ద్వారా పక్షులను సంహరించాలని నిర్ణయిందింది అక్కడి ప్రభుత్వం.

Must Read

spot_img