Homeఅంతర్జాతీయంఅత్యంత ప్రమాదకరమైన మెట్లు..!

అత్యంత ప్రమాదకరమైన మెట్లు..!

చూస్తేనే కళ్లు తిరిగిపోయేలా ఉండే ఆ మెట్లను మోస్ట్ డేంజరస్ స్టెయిర్స్ అని పిలుస్తారు. నిజానికి ఆ మెట్ల మార్గం స్వర్గానికి దారిగా చెబుతున్నారు. ఆ స్వర్గం ఎక్కడుందో ఎందుకు ఆ పేరు వచ్చిందో కానీ ఆ మెట్లు ఎక్కాలంటే గుండె నిండా దైర్యం కావాలి. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన స్కారీయెస్ట్ మెట్లని చెబుతున్నారు. సాహసికులే ఆ దైర్యం చేస్తుంటారు.ఇంతకీ ఆ మెట్లు ఎక్కడున్నాయి. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..

స్వర్గానికి దారితీసే ఈ మెట్లు ఎక్కాలంటే ధైర్యం కావాలి.. ఎందుకంటే ప్రపంచంలోనే ఇవి అత్యంత భయంకరమైనవి. ప్రయాణాలంటే ఆసక్తి ఉన్నవారు సాహసం చేసేవారు కొత్త ప్రాంతాలను అన్వేషించడానికి ఇష్టపడతారు. ప్రపంచంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కొన్ని ప్రదేశాలను చూడాలంటే చాలా కష్టపడాలి. మరికొన్నింటిని చూడాలంటే నిండైన గుండె దైర్యం ఉండాలి.

అలాంటి వారికోసమే ఈ వార్త. ముఖ్యంగా భారతీయులకు మెట్లు ఎక్కడం, దిగడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే భారతదేశంలోని చాలా పుణ్యక్షేత్రాలు పర్వత ప్రాంతంలోనే ఉన్నాయి. కాబట్టి భక్తులు తమ ఇష్ట దైవ దర్శనం కోసం వేలాది మెట్లు ఎక్కుతుంటారు. మెట్లు వెడల్పుగా, నడవడానికి సౌకర్యంగా ఉంటే మంచిది.

కానీ కొన్ని మెట్లు ప్రమాదకరమైనవిగా ఉంటాయి. కాస్త అజాగ్రత్తగా ఉన్నామంటే ఇక అంతే సంగతులు. నేరుగా ప్రమాదానికి ఆహ్వానం పలుకుతున్నట్టుగానే ఉంటుంది. ఇలాంటి ప్రమాదకరమైన మెట్లు ప్రపంచంలో చాలా ప్రదేశాలలో ఉన్నాయి. వాటిని తలదన్నే స్కారీయెస్ట్ మెట్లు కంబోడియాలోని అంకోర్ వాట్ ఆలయం వద్ద ఉన్నాయి. ఇక్కడి ఒక దేవాలయం దగ్గర స్వర్గానికి దారిగా చెప్పుకునే మార్గంలో ఉన్నాయి.

ఇది 162.6 హెక్టార్ల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన స్మారక చిహ్నం. ఇక్కడ మెట్లు భయానకంగా ఉంటాయి. దీనిని స్వర్గానికి మెట్ల మార్గం అంటారు. 70 శాతం మెట్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. మెట్లు ఎక్కడానికి మళ్లీ దిగాలంటే తాడు సహాయం కావాలి. ఇది విష్ణుమూర్తికి సంబంధిచన అతి పెద్ద దేవాలయం.

విష్ణు దర్శనం కావాలంటే ఈ మెట్లు ఎక్కాల్సిందే..అంత దైర్యం కలిగి ఉండాల్సిందే..

విష్ణు దర్శనం కావాలంటే ఈ మెట్లు ఎక్కాల్సిందే..అంత దైర్యం కలిగి ఉండాల్సిందే..ఓవరాల్ గా ఎవరైనా సరే ప్రాణాలకు తెగించి ఇక్కడ కష్టపడాల్సిందే. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహం ఉన్న ప్రదేశం. బటు గుహలు మలేషియాలోని గోంబాక్ జిల్లాలో ఉన్నాయి. ఈ గుహలు సున్నపురాయి కొండపై ఉన్నాయి. ఈ గుహలే కాకుండా ఇక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయి.

బటు నది ఈ కొండ గుండా ప్రవహిస్తుంది. అందుకే దీన్ని బటు గుహలు అంటారు. మురుగన్ విగ్రహాన్ని దర్శించుకోవాలంటే గుహ లోపల 50 మెట్లు ఎక్కాలి. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ పేరు చాలా మంది వినే ఉంటారు. అమెరికాకు వెళ్లినవారు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడకపోతే అసంతృప్తిగా ఉంటుంది.

స్వేచ్ఛకు ప్రతిరూపమైన ఈ విగ్రహం.. ఆమెరికాకు ప్రతీకగా నిలిచింది. సంవత్సరమంతా పర్యాటకులతో ఇది రద్దీగానే ఉంటుంది. ఇది న్యూయార్క్ హార్బర్‌లో ఉంది. 305 అడుగుల ఎత్తుతో భారీ రాగి విగ్రహం ఇది. 22 అంతస్తుల విగ్రహం పైకి చేరుకోవడానికి 354 మెట్లు ఎక్కాలి.

నార్వేలోని ఫ్లోరాలి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మెట్లకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మొత్తం 4వేల 444 మెట్లు ఉన్నాయి. వీటి ఎత్తు 2 వేల 427 అడుగులు. ఈ మెట్లు రాతితో చేసినవి కావు.. చెక్కతో చేసిన మెట్లు. ఈ మెట్లు పైకి ఎక్కడం అంటే ఈఫిల్ టవర్‌ను 2 సార్లు కంటే ఎక్కువ సార్లుఎక్కినట్లే.

ఈ మెట్లు 100 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి. ఇది చైనాలో ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమైన పర్వతారోహణలలో ఒకటి.

ఈ దశలను ఇప్పటివరకు ఎవరూ లెక్కించలేకపోయారు. మెట్లు ఎక్కి స్వర్గ దృశ్యాన్ని చూడవచ్చు. హుషాన్ పర్వతం మీద అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలలో ఒకటి హుషాన్ టీహౌస్. ఇది దక్షిణ శిఖరంపై ఉన్న బౌద్ధ, దావోయిస్ట్ దేవాలయం. ఆలయానికి చేరుకోవడానికి, సందర్శకులు స్వర్గపు మెట్లు పైకి ఎక్కవలసి ఉంటుంది. ఇది చాలా నిటారుగా ఉన్న పర్వతంపై చెక్కబడిన రాతి మెట్ల పొడవైన కాలిబాట.

వీటిని స్వర్గానికి మెట్లు అని కూడా అంటారు. అవి చెక్కతో తయారు చేయబడ్డాయి. ఇక్కడ మొత్తం 3922 మెట్లు ఉన్నాయి. 1987 తర్వాత ఈ మెట్లు మూసివేయబడ్డాయి. కానీ చాలామంది ఎక్కుతారు. ఇది అమెరికాలో ఉంది. అటు తెహాంగ్ మెట్లు చైనాలో ఉన్నాయి. తెహాంగ్ స్టెప్స్ ఎత్తు 300 అడుగులు. మెట్లు ఎక్కాలంటే శారీరకంగా దృఢంగా ఉండాలి. అరవై ఏళ్ల లోపు వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కగలరు.

Must Read

spot_img