జై భీమ్, ఆకాశం నీ హద్దురా సినిమాలతో రెండు రియల్ లైఫ్ హీరోల పాత్రలని హీరో సూర్య పోషించి…సక్సెస్ అందుకున్నారు. రెండు భిన్నమైన నేపధ్యాలు ఉన్న కథలు. జైభీమ్ లో ఒక చంద్రు అనే లాయర్ పాత్రలో ఆకట్టుకోగా..ఆకాశం నీ హద్దురా సినిమాలో ఎయిర్ డెక్కన్ ఎయిర్ లైన్స్ అధినేత గోపీనాథ్ పాత్రలో సూర్య నటింటి కన్నీరు పెట్టించారు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొని నేషనల్ అవార్డులని సైతం గెలుచుకున్నాయి. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు మరో బయోపిక్ లో నటించనున్నట్లు తెలుస్తోంది.
సూర్య కమర్షియల్ హీరోగా ఫిక్షనల్ స్టోరీస్ చేస్తూనే…మరో వైపు నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రియల్ లైఫ్ కథలని కూడా సూర్య నటిస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ శివతో ఓ ఫిక్షనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని పీరియాడిక్ జోనర్ లో చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సూర్య మరో బయోపిక్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.
బ్రిటానియా బిస్కెట్స్ అధినేత రంజన్ పిళ్ళై జీవిత కథని తెరపైకి తీసుకొచ్చేందుకు మలయాళీ దర్శకుడు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే ఈ కథపై చాలా రీసెర్చ్ చేసి సిద్ధం చేసిన పృథ్వీరాజ్…ఇప్పుడు ఆ సినిమాలో లీడ్ రోల్ కోసం చాలా మంది హీరోల పేర్లు పరిశీలించినట్లు తెలుస్తుంది. ఇక ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ తమిళ్ స్టార్ సూర్య దగ్గరకి వచ్చిందని తెలుస్తుంది.
ఇక సూర్య కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ సూర్య 43వ చిత్రంగా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయనే మాట కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తుంది. బ్రిటానియా బిస్కెట్స్ అంటే దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఆ బిస్కెట్స్ ని ప్రత్యేకమైన బ్రాండ్ వేల్యూ కూడా మార్కెట్ లో ఉంది. ఈ నేపధ్యంలో రంజన్ పిళ్ళై బయోపిక్ ని పాన్ ఇండియా స్థాయిలోనే తీసుకొచ్చేందుకు పృథ్వీరాజ్ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది.