హిండెన్ బర్గ్ .. ఆదానీ గ్రూప్ పై వెలువరించిన రిపోర్టు .. ప్రకంపనలకు దారి తీస్తోంది. షేర్ విలువ దారుణంగా పడిపోయింది.. దీనికంతటికీ .. కారణం .. హిండెన్ బర్గ్ అన్నది .. హాట్ టాపిక్ గా మారింది. దీంతో అసలెవరీ హిండెన్ బర్గ్ .. ఎక్కడ ఏర్పాటైంది.. దీని కథా కమామీషు ఏమిటన్న చర్చ .. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
భారత స్టాక్ మార్కెట్లలో మళ్లీ భయం మొదలైంది. క్రితం రెండు సెషన్లలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఏకంగా రూ.10 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. దీంతో ట్రేడర్లు లబోదిబోమంటున్నారు. విదేశీ సంస్థాగత మదుపర్లు పెద్దఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ముఖ్యంగా అదానీ గ్రూప్ స్టాక్స్ దారుణంగా పతనమవుతున్నాయి. దీంతో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రెండే రెండు ట్రేడింగ్ సెషన్లలో ఏకంగా రూ.4 లక్షల కోట్లు పతనమైంది. గౌతమ్ అదానీ సంపద కూడా 20 బిలియన్ డాలర్లకుపైగా పడిపోయి.. ప్రపంచ కుబేరుల జాబితాలో ఏకంగా ఏడో స్థానానికి పడిపోయారు. దీనికంతటికీ కారణం.. హిండెన్బర్గ్.
అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్బర్గ్ సంచలన రిపోర్ట్తో అదానీ సంపద ఆవిరైంది. భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అదానీ గ్రూప్.. భారత స్టాక్మార్కెట్లో అవకతవకలకు పాల్పడుతోందని, అకౌంటింగ్ మోసాలు చేస్తోందని ఆరోపించింది. రెండేళ్లకుపైగా పరిశోధన జరిపి.. పెద్ద రిపోర్ట్ ప్రచురించింది. అదానీకి 88 ప్రశ్నలు సంధించింది. అంతే.. అదానీ గ్రూప్ స్టాక్స్ రెండు రోజులకే కుప్పకూలాయి. షేరు విలువ దారుణంగా పడిపోయింది. ఇకముందూ ఇది
కొనసాగే అవకాశాలున్నాయి. దీంతో ఈ హిండెన్బర్గ్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు జనం.
ఈ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఫర్మ్ అనేది అమెరికా న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తోంది. నాథన్ అండర్సన్ అనే 38 ఏళ్ల వ్యక్తి.. 2017 లో దీనిని స్థాపించాడు. మానవ నిర్మిత విపత్తులను వెలికితీయడమే దీని పని. ఫైనాన్షియల్ ఫోరెన్సిక్ రీసెర్చ్ సేవలందిస్తుంటోంది. ఆయా కంపెనీల్లో ఫ్రాడ్స్, దుర్వినియోగం, సీక్రెట్ కార్యకలాపాలు, ఇతర మోసాలను గుర్తించి నివేదికలు వదులుతుంది. అంతే కాక .. అదే కంపెనీని టార్గెట్ చేసి.. షార్ట్ సెల్లింగ్ చేసి సవాల్ చేస్తోంది.
సాధారణంగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లో చాలా రకాలే ఉంటాయి. ముందు షేర్లను కొని పెరిగాక అమ్మడం చేస్తుంటారు. ఇది ఇంట్రాడే, డెలివరీ అని రెండు విధాలుగా చేయొచ్చు. అయితే షేర్లు ఎక్కువ ధర వద్ద విక్రయించి.. పతనమయ్యాక అంటే ధర తగ్గాక కొని ట్రేడింగ్ను ముగించి లాభాలుసొమ్ముచేసుకోవచ్చు. దీనిని షార్ట్ సెల్లింగ్ అంటారు. అంటే ఏదైనా స్టాక్ పడిపోతుందని భావిస్తే.. ఈ షార్ట్ సెల్లింగ్ చేయొచ్చు. అప్పుడు ఎక్కువ విలువ దగ్గర తొలుత విక్రయించి.. షేరు విలువ పడిపోయాక తిరిగి కొని ట్రేడింగ్ చేయొచ్చు. ఈ హిండెన్బర్గ్ కూడా అదే చేస్తుంటుంది.
మరీ ముఖ్యంగా.. ఇలాంటి రిపోర్ట్లు ఇచ్చే ముందు సదరు కంపెనీల్లోనూ పెట్టుబడులు పెడుతుంది. అప్పుడు ఎలాగూ స్టాక్ ధర పడిపోతుందని తెలుసో?లేదా పడిపోయేలా చేయడమో? చేసి లాభాలు ఆర్జిస్తుంటుంది. అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ రిపోర్ట్ విడుదల చేసే ముందు కూడా అందులో ఇన్వెస్ట్ చేసి కోట్లు దండుకొని ఉండొచ్చని తెలుస్తోంది. హిండెన్బర్గ్ రీసెర్చ్ స్థాపకుడు నాథన్ అండర్సన్ గురించి చాలా వివరాలు బయటికి రావు. తెలియవు. యూనివర్సిటీ ఆఫ్ కనెక్టివిటీ నుంచి ఇంటర్నేషనల్ బిజినెస్ పట్టా పొందాడు. ఆ తర్వాత కొన్నేళ్లు ఇజ్రాయెల్లో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేశాడు. తర్వాత అమెరికాలోని ఒక డేటా కంపెనీలో ఫ్యాక్ట్సెట్ రీసెర్చ్ సిస్టమ్స్ కంపెనీలో పనిచేశాడు.
ఎక్కడ పనిచేసినా.. ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్కు సంబంధించిన పనే చేశాడు. ఎలాంటి ఒత్తిడిలోనైనా పనిచేయడం ఎలానో నేర్చుకున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తర్వాత హిండెన్బర్గ్ను స్థాపించి పలు కంపెనీల గుట్టు విప్పుతున్నాడు. ఏదైనా కంపెనీని లక్ష్యంగా చేసుకుంటే.. మొదట 6 నెలలు.. పబ్లిక్ రికార్డ్స్, ఇంటర్నల్ కార్పొరేట్ డాక్యుమెంట్స్ను పరిశీలించాక.. ఆ కంపెనీలో పనిచేసే, పనిచేసిన ఉద్యోగులతో మాట్లాడి, దేశవిదేశాలు తిరిగి సమాచారం సేకరిస్తుంటుంది.
ఇక షార్ట్ సెల్లింగ్ పొజిషన్ తీసుకొని ఒక్కసారిగా రిపోర్ట్ వదిలి.. లాభాలను సొంతం చేసుకుంటుంది. 2020లో అమెరికాలోని నికోలా కార్పొరేషన్ను హిండెన్బర్గ్ రీసెర్చ్ ఇలానే టార్గెట్గా పెట్టుకుంది. ఇక ఆ కంపెనీలో ఫ్రాడ్స్ బయటపడటంతో కంపెనీ స్టాక్ విలువ ఏకంగా 40 శాతం వరకు పతనమైంది. అమెరికాఎస్ఈసీ ఇన్వెస్టిగేషన్లోనూ ఆ కంపెనీలో అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. మొత్తంగా ఇప్పటివరకు 16 కంపెనీల్లో ఇలా ఇన్వెస్టిగేషన్ చేసింది. జర్మనీకి ఒక ఒక ప్యాసింజర్ ఎయిర్షిప్ పేరు హిండెన్బర్గ్. 1937లో ఇది ప్రమాదానికి గురైంది. ఈ విపత్తులో 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
మానవుడి నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగిందని, అందుకే తన కంపెనీకి అదే పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చాడు నాథన్ అండర్సన్. హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ ఇండియన్ షేర్ మార్కెట్, అదానీ గ్రూప్ పరిస్థితిని పాడు చేసేస్తోంది. బుధవారం తరువాత శుక్రవారం నాడు షేర్ మార్కెట్లో వచ్చిన క్షీణత..మూడో స్థానంలో ఉన్న అదానీని 7వ స్థానానికి మార్చేసింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ చాలా శక్తివంతమైన రిపోర్ట్. ఈ కంపెనీ ఏ కంపెనీపై నివేదిక ఇస్తుందో ఆ కంపెనీ షేర్లు పడిపోవల్సిందే.
టార్గెట్ చేసి మరీ కొడుతుంటుంది. అదే జరిగింది. అదానీ గ్రూప్ టార్గెట్ చేసి విడుదల చేసిన రిపోర్ట్ కారణంగా అదానీ కంపెనీ షేర్లు గణనీయంగా పడిపోతున్నాయి. దేశంలో అత్యంత ధనికుడిగా ఉన్న వ్యక్తి సంపదలో 4 లక్షల కోట్లను ఈ రిపోర్ట్ క్లీన్ చేసేసింది. రిపోర్ట్ కారణంగా కంపెనీ షేర్లు వేగంగా పడిపోతున్నాయి. మార్కెట్ క్లోజ్ సమయానికి అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్ షేర్లలో 20 శాతం క్షీణత నమోదైంది. ఆదానీ ఎంటర్ప్రైజెస్ 18 శాతం, అంబూజా సిమెంట్ 16 శాతం, అదానీ పోర్ట్స్ 15 శాతం, ఏసీసీ సిమెంట్ 12 శాతం, అదానీ విల్మార్ 5 శాతం, అదానీ పవర్ 5 శాతం క్షీణత నమోదు చేశాయి.
హిండెన్బర్గ్ రీసెర్చ్ ప్రపంచంలోని మూడవ అత్యంత ధనికుడైన వ్యక్తి ఏ విధంగా కార్పొరేట్ ఇండస్ట్రీలో అత్యంత మోసపూరితమైన పనికి పాల్పడ్డారనే శీర్షికతో నివేదిక ప్రచురించింది. అదానీ గ్రూప్ కంపెనీలు మార్కెట్ వ్యాల్యూని ఎలా మ్యానిప్యులేట్ చేశాయో చెబుతూ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. అదానీ గ్రూప్ కంపెనీలు షేర్ల ధరల్ని మ్యానిప్యులేట్ చేశాయి. ఎక్కౌంట్ మోసాలకు పాల్పడింది. అదానీ గ్రూప్ విదేశాల్లో చాలా షెల్ కంపెనీలు సృష్టించి ట్యాక్స్ ఎగవేతకు పాల్పడింది. మారిషస్, కరేబియన్ దీవుల్లో చాలా బినామా కంపెనీల్లో అదానీ గ్రూప్ కంపెనీలు వాటా ఉంది.
అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలపై భారీగా రుణాలున్నాయి. ఈ రుణాలు మొత్తం గ్రూప్ని ఆర్ధిక విపత్తు స్థితికి తీసుకొచ్చాయి. అధిక విలువ కట్టడం ద్వారా కంపెనీ షేర్ల విలువ 85 శాతం వరకూ పెంచి చూపిస్తోంది. ఈ రిపోర్ట్ ప్రభావం ఎంత దారుణంగా పడిందంటే..కేవలం 2 రోజుల్లోనే అదానీ గ్రూప్ భారీగానష్టాన్ని ఎదుర్కొంది. జనవరి 25 నుంచి జనవరి 27 మధ్య కాలంలో అంటే రెండ్రోజుల్లో అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ నుంచి 4 లక్షల 10 వేల రూపాయలు నష్టపోయాయి. జనవరి 25న మార్కెట్ క్యాప్ దాదాపు19 లక్షల కోట్ల రూపాయలుంది.
అది కాస్తా క్షీణించి 15 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే 25 శాతం క్షీణత నమోదైంది. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ 20 వేల కోట్ల రూపాయలు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అంటే ఎఫ్పీవోను కూడా ఓపెన్ చేసింది. దీని ప్రైస్బ్యాండ్ 3112 నుంచి 3276 రూపాయలు షేర్ నిర్ణయించారు. కానీ హిండెన్బర్గ్ రిపోర్ట్ ప్రభావంతో తొలిరోజున కేవలం 1 శాతమే సబ్స్క్పైబ్ అయింది. ఫోర్బ్స్ జాబితాలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మూడవ స్థానం నుంచిపడిపోయి..7వ
స్థానానికి చేరుకున్నారు.