Homeసినిమాఅవతార్ సిరీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే..

అవతార్ సిరీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే..

ఎందుకంటే అవతార్ సినిమాలు చూసిన ప్రేక్షకులు ఏదో తాము ఒక వింత లోకానికి వెళ్లి వచ్చినట్లు ఫీలయ్యారు. ఇటీవల రిలీజైన అవతార్-2 ది వే ఆఫ్ వాటర్ కూడా ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది. దీంతో అవతార్-3పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా డైరెక్టర్ జేమ్స్ కామెరూన్.. అవతార్ 3 గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమా కాన్సెప్ట్‌పై ఓ హింట్ ఇచ్చాడు.

విజువల్‌ వండర్‌‌గా తెరకెక్కిన అవతార్‌-2 కలెక్షన్ల సునామీ సృష్టించింది. ‘అవతార్‌’కు కొనసాగింపుగా జేమ్స్‌ కామెరూన్‌ తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు ఓ సరికొత్త ఫీలింగ్‌ను ఇచ్చింది. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద కూడా దుమ్మురేపింది. దీంతో అవతార్‌-3పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అసలు రాబోయే అవతార్ మూవీ ఎలా ఉంటుంది? కాన్సెప్ట్ ఏదై ఉంటుంది? అని ఆలోచిస్తున్నారు.

తాజాగా దీని గురించి డైరెక్టర్ జేమ్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. క్రిటిక్‌ ఛాయిస్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో జేమ్స్ కామెరూన్ పాల్గొన్నారు. ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్‌ మూవీ కేటగిరిలో ‘అవతార్‌2’ అవార్డు సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కామెరూన్‌ ‘అవతార్-3’ గురించి మాట్లాడారు. అగ్ని ప్రధానంగా మూడో భాగం సాగుతుందని చెప్పారు. మూడో భాగం పాండోరాలోని ఎడారిలాంటి ప్రదేశంలో సాగుతుందని హాలీవుడ్‌‌లో ఇప్పటికే టాక్‌ నడుస్తోంది.

అక్కడ ఉండే సంపదను సొంతం చేసుకునేందుకు మనుషులు ఏం చేశారు..? జేక్‌, అతడి కుటుంబ వారిని ఎలా అడ్డుకుంది..? ఈ క్రమంలో జేక్‌ కుటుంబానికి ఎలాంటి ఆపద కలిగింది…? వంటి అంశాలను కామెరూన్‌ చూపిస్తారని అంటున్నారు.అవతార్‌-2’తో పాటే ‘అవతార్‌-3’ చిత్రీకరణ కూడా జేమ్స్‌కామెరూన్‌ దాదాపు పూర్తి చేశారు. కొంత ప్యాచ్‌ వర్క్‌తో పాటు, కీలకమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌ పని మిగిలి ఉంది.

ఈ సినిమాను 2024 డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర బృందం చెప్పింది. మరోవైపు ‘అవతార్‌: ది వే ఆఫ్ వాటర్‌’ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులు సృష్టించింది. మొత్తంగా 1.9బిలియన్‌ డాలర్ల వసూళ్లు సాధించింది.

Must Read

spot_img