Homeజాతీయండేటింగ్ చేయడం కోసం అనేక మంది ఆసక్తి చూపిస్తుంటారు..

డేటింగ్ చేయడం కోసం అనేక మంది ఆసక్తి చూపిస్తుంటారు..

అలా ఆసక్తి చూపించేవారినే లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్ కు పాల్పడుతున్నారు.. ఇంతకూ ఈ డేటింగ్ యాప్ ల ద్వారా కిడ్నాప్లు చేసే గ్యాంగ్ లు ఎక్కడ ఉన్నాయి..?

డేటింగ్ యాప్ ల సహాయంతో పురుషులనే లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్ చేసే ముఠా ఎక్కడింది..?

కిడేటింగ్ యాప్ ద్వారా ఒక వ్యక్తికి… ఓ మహిళతో పరిచయం అవుతుంది. ఇద్దరి మధ్య మెసేజ్‌లు నడుస్తాయి. కొంతకాలం తర్వాత వారిద్దరూ వ్యక్తిగతంగా కలుసుకోవడం కోసం ఏర్పాట్లు చేసుకుంటారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రదేశానికి రాగానే ఆ వ్యక్తి కిడ్నాప్‌కు గురవుతారు… సినిమా కథను తలపించేలా డేటింగ్ యాప్ ద్వారా జరుగుతోన్న మోసం తీరు ఇది. డేట్‌ను కలవడం కోసం చేసుకున్న ఏర్పాట్లు కొంతకాలం వరకు బాధితులను పీడకలలా వెంటాడుతుంటాయి.

బ్రెజిల్‌లో అతిపెద్ద, ధనిక నగరం సావో పాలో. అక్కడ ఈ తరహా నేరాలు సర్వసాధారణంగా మారాయి. టిండర్ వంటి డేటింగ్ యాప్‌లలో నకిలీ ఖాతాలు క్రియేట్ చేసి ఎర వేస్తున్నారు. స్థానిక పోలీసుల వద్ద నమోదైన కిడ్నాప్ కేసుల్లో 90 శాతానికి పైగా టిండర్ యాప్‌ తో సంబంధం ఉన్నవే.. కిడ్నాపర్లకు
డబ్బు చెల్లించే సమయంలో బాధితులు మానసిక, కొన్నిసార్లు భౌతిక హింసకు గురవుతారు.. సావో పాలో సివిల్ పోలీసు విభాగానికి చెందిన యాంటీకిడ్నాపింగ్ అధికారులు, 2022 ఏడాదిలోనే ఇలాంటి 94 కేసుల్లో చర్యలు తీసుకొని 250కి పైగా అనుమానితులను అరెస్ట్ చేశారు.

నేరగాళ్ల ప్రధాన లక్ష్యం 40 ఏళ్లు పైబడిన ఒంటరి పురుషులే. నగరంలోని ప్రముఖ ఆసుపత్రి ‘డాస్ క్లినికాస్’ వైద్యుడు కూడా
ఇలాంటి బాధితుల్లో ఒకరు. ఆయన డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తిని వ్యక్తిగతంగా కలిసేందుకు వెళ్లి ఆ తర్వాత 14 గంటల పాటు నేరస్థుల చేతుల్లో బందీ అయ్యారు. ఖాతాలోని డబ్బునంతా ఖాళీ చేసిన తర్వాతే నేరగాళ్లు ఆయనను వదిలేశారు. రుణాలు, కొనుగోళ్లు, నగదు బదిలీలు ద్వారా దాదాపు 14,000 డాలర్లును కాజేశారు. ఎలాంటి వ్యక్తులపై కన్నేస్తారంటే.. ఇలాంటి నేరాలకు పాల్పడేవారు,
ముందుగా బాధితుల ఆన్‌లైన్ వ్యవహారాలను అధ్యయనం చేస్తారు.. ‘‘సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో తమ ఆర్థిక స్థాయిని ప్రదర్శించే వినియోగదారులను వారు గమనిస్తారు. తర్వాత వారికి ఎర వేస్తారు..

ఇలాంటి ముఠాలు ఎలా పనిచేస్తుంటాయి..? కిడ్నాపర్ల ఉచ్చులో పడుతున్నామని గ్రహించడం ఎలా..?

ఆర్థికంగా విజయవంతమైన మధ్య వయస్సులో ఉన్న ఒంటరి పురుషులే సాధారణంగా బాధితులుగా మారుతున్నారని పావో పాలో ఉత్తర భాగంలో పనిచేస్తున్న మిలిటరీ పోలీస్ అధికారులు వెల్లడించారు.. 40ఏళ్లు పైబడి, కాస్త ఆస్తిపాస్తులు ఉన్న ఒంటరి పురుషులు బాధితులు అవుతున్నారు. చాలామంది నేరగాళ్లు, టిండర్ యాప్‌ లో ప్రలోభ పెట్టే మెసేజ్‌లు చేయడం ద్వారా, వీలైనంత త్వరగా కలవాలని ఆశ పుట్టించేలా మాట్లాడటం ద్వారా బాధితులను ఆకర్షిస్తున్నారు..

డేటింగ్ యాప్‌లో అందుబాటులో ఉన్న వ్యక్తిగత సమాచారం ఆధారంగా నేరస్థులు, మోసం చేయాలనుకునే వారిని ఎంపిక చేసుకుంటారు. ముఖ్యంగా అంతర్జాతీయ పర్యటనలు, విలాసవంతమైన కార్ల ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకునే వారిపై వారు దృష్టి సారిస్తారు.

టిండర్ యాప్‌లో మామూలుగా బాధితులను సాయంత్రం సమయాల్లో, మారుమూల ప్రాంతాల్లో వ్యక్తిగతంగా కలుద్దామంటూ నేరస్థులు కోరతారు. ఒక వ్యక్తి, టిండర్ యాప్‌లో పరిచయమైన మహిళను ఒక షాపింగ్ మాల్‌లో వ్యక్తిగతంగా కలిసేందుకు ప్రయత్నించారు. కానీ, ఆమె అనారోగ్యంగా ఉన్నానంటూ, ఇల్లు వదిలి బయటకు రాలేనంటూ విచారం వ్యక్తం చేయడంతో అతను ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లాడు. అక్కడే అతను కిడ్నాప్ అయ్యాడు. యాప్‌లో పరిచయమైన రెండు, మూడు రోజుల తర్వాత ఇలాంటి సమావేశాలు జరుగుతాయి.. వివిధ కారణాలతో ఈ డేటింగ్ యాప్ కిడ్నాప్‌ల గురించి తక్కువగా
పోలీసులకు నివేదిస్తున్నారని వారి విచారణలో తేలింది..

ఈ కారణాల్లో మొదటిది ఏంటంటే…పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు నమోదు చేయడానికి బాధితులు సంకోచించడం. మరో ప్రధాన కారణం ఇలాంటి మోసాలకు గురైనవారు అసలు విషయం చెప్పకుండా… తమ భాగస్వాములకు తాము మరో వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలియకుండా ఉండేందుకు డబ్బు కోసం ఎవరో తనను కిడ్నాప్ చేశారని చెబుతుంటారు. సంపన్నులు, విద్యావంతులైన పురుషులు రొమాంటిక్‌గా గడపడం కోసం మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు ఒప్పుకొని ఇలాంటి మోసాలకు తరచుగా బాధితులుగా మారడం జరుగుతోంది.. చాలా కేసుల్లో సంబంధిత వ్యక్తి బంధువులు పోలీసులకు ఫోన్ చేసిన తర్వాతే బాధితుల అదృశ్యం గురించి తెలుస్తుంది. తమ వారు కనిపించడం లేదని కుటుంబంలో ఎవరో ఒకరు గుర్తించిన తర్వాత ఈ విషయం గురించి పోలీసులకు చెబుతారు. ఏ ఇద్దరు బాధితులు కూడా ఒకే ప్రదేశంలో కిడ్నాప్ అవ్వడం ఇంతవరకు జరగలేదు. కానీ ఒకే నగరంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి… బ్రెజిల్‌ స్వచ్ఛంద సంస్థ ‘సేఫర్ నెట్’‌లో గిల్‌హామ్ అల్వ్స్ ఒక డిజిటల్ సెక్యూరిటీ నిపుణుడిగా పని చేస్తున్నారు.

ఇంటర్నెట్ నేరాలను పరిష్కరించడం కోసం ఈ స్వచ్ఛంద సంస్థ పని చేస్తుంది. మోసాలు చేయడం కోసం నేరస్థులు తరచుగా డేటింగ్ యాప్‌ లను వాడుతారు.. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్లాట్‌ఫారమ్ దేనికి బాధ్యత వహిస్తుందో అర్థం చేసుకోవడం. యాప్ బయట ఏం జరుగుతుంది అనేది ఆ కంపెనీ పరిధిలోనికి రాని అంశం. ఒకవేళ ఏదైనా నేరం జరిగితే కోర్టులో స్కామర్ ప్రొఫైల్ నుంచి సమాచారాన్ని పొందడం మాత్రం సాధ్యమవుతుంది..

కొన్ని కేసుల్లో మోసగాళ్లు బాధితులకు ఎర వేసేందుకు నకిలీ ఫొటోలు, ప్రొఫైళ్లు వాడకుండా నిజమైన వ్యక్తుల ఫొటోలు వాడతారు.. ఒకవేళ అది క్యాట్‌ఫిషింగ్ స్కామ్ అయితే యాప్‌లోని ప్రొఫైల్ నకిలీది అయి ఉంటుంది. అప్పుడు క్రిమినల్ మనల్ని వాట్సాప్ వంటి మరో ప్లాట్‌పామ్‌పైకి తీసుకెళ్తుంటారు. యాప్‌లో ప్రొఫైల్ డిలీట్చే శామని, అందుకే వాట్సాప్‌లోకి రావాలంటూ నేరగాళ్లు చెబుతుంటారు. యాప్‌లో తొలిసారి పరిచయం అయిన తర్వాత ప్రొఫైల్‌ను డిలీట్ చేశారంటే వారు తమ సమాచారాన్ని దాచేందుకు ప్రయత్నిస్తున్నట్లు. అలాగే పరిచయమైన కొన్ని రోజుల్లోనే వ్యక్తిగతంగా కలవాలని కోరేవారిని, డేటింగ్ యాప్ ప్లాట్‌ఫారమ్‌ను వదిలి వాట్సాప్‌కు రావాలని కోరే వ్యక్తులను మారుమూల లేదా ప్రైవేటు ప్రదేశాలలో కలవడం వంటివి చేయకూడదు.

ఆ వ్యక్తితో చేసిన మెసేజ్‌లను భద్రంగా ఉంచుకోవాలి. కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఎక్కువ మంది ఉండే ప్రదేశాలు అంటే షాపింగ్ మాల్స్ వంటి వాటిని ఎంచుకోవాలి. కొన్ని కేసుల్లో తొలి రెండు, మూడు సమావేశాల్లో నెమ్మదిగా వ్యవహరించే మోసగాళ్లు ఆ తర్వాత తమ చేతి వాటం చూపిస్తారు. ఇలాంటి ఒక కేసులో ఒక మహిళ కొత్త వ్యక్తిని రెండు సార్లు కలిసింది. అప్పుడు అతను సాధారణంగానే ప్రవర్తించారు. ఇక మూడో సమావేశం సమయంలోనే అతను ఆమెను దోచుకొని పరారు అయ్యాడు..

డేటింగ్ యాప్ ల సహాయంతో మధ్య వయసు, డబ్బు ఉన్న పురుషులనే లక్ష్యంగా చేసుకుని వారిని నిట్టనిలువుగా దోచుకుంటున్నారు నేరగాళ్లు.. ఈ తరహా మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందే..

Must Read

spot_img