Homeజాతీయంఐడబ్ల్యూటీపై సంతకాలు చేసిన పాక్.. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందా..?

ఐడబ్ల్యూటీపై సంతకాలు చేసిన పాక్.. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందా..?

సింధు నదీ జలాల ఒప్పందాన్ని మార్చుకుందామంటూ పాకిస్థాన్‌కు భారత్‌ నోటీసు జారీ చేసింది. ఈ ఒప్పందంలో పాక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతుండడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని భారత ప్రభుత్వ వర్గాలు తెలపడం చర్చనీయాంశంగా మారింది..

సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో భారత్, పాకిస్తాన్ ల మధ్య గత కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి.. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.. ఈ ఒప్పందాన్ని సవరించుకుందామంటూ దాయాది పాక్ కు భారత్ నోటీసు ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.. సింధు జలాల ఒప్పంద కమీషనర్ల ద్వారా జనవరి 25న ఈ నోటీసు పంపినట్లు పేర్కొన్నాయి.. ఈ ఒప్పందం అమలుపై పాక్ మొండి వైఖరి కారణమని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి..

సింధు జలాల ఒప్పందం అమలులో పాకిస్థాన్ మొండిగా వ్యవహరిస్తోందని భారత్ ఆరోపించింది. దీంతో దాయాది దేశానికి నోటీసులు పంపించింది.. సవరించిన నోటీసును జనవరి 25నే ఇస్లామాబాద్‌కు పంపామని భారత్ వర్గాలు చెబుతున్నాయి. తొమ్మిదేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం 1960 సెప్టెంబర్‌లో ఇండియా, పాకిస్థాన్ దేశాలు ఐడబ్ల్యూటిపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంపై ప్రపంచ బ్యాంకు కూడా సంతకం చేసింది.

నదీ జలాల వినియోగానికి రెండు దేశాల మధ్య సహకారం, సమాచార మార్పిడి కోసం ఒక యాంత్రిక విధానాన్ని రూపొందించింది. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, అప్పటి పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య నదీ జలాల పంపకాలు జరిగాయి. ఈ ఒప్పందం ప్రకారం సింధు, జీలం, చీనాబ్ నదులు పాక్‌కు దక్కగా… రావి, బియాస్, సట్లేజ్ నదులు భారత్‌కు దక్కాయి. రెండు దేశాల సహకారం కొనసాగేందుకు సింధు శాశ్వత కమిషన్ కూడా ఏర్పాటైంది. దీనికి రెండు దేశల నుంచి కమీషనర్లు బాధ్యులుగా ఉన్నారు..

ఐడబ్ల్యూటిలోని ప్రతి అక్షరాన్ని అమలు చేసేందుకు భారత్ కృత నిశ్చయంతో ఉందని.. బాధ్యతాయుతమైన భాగస్వామిగా వ్యవహరిస్తోందని ‘ఐడబ్ల్యూటిలోని నిబంధనలను పాకిస్థాన్ అమలు చేయకపోవడంతో ఒప్పందాన్ని సవరించడానికి భారత్ బలవంతంగా నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది’ అని భారత్ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌లోని కిషన్‌గంగా, రాట్లే హైడ్రో ఎలక్రిక్ ప్రాజెక్ట్‌ల సాంకేతిక అభ్యంతరాలపై చర్చించేందుకు పాక్ నిరాకరిస్తూనే ఉంది. వాటిని పరిశీలించేందుకు తటస్థ నిపుణుడిని నియమించాలని 2015లో పాకిస్తాన్ కోరింది. అయితే మరుసటి సంవత్సరమే ఈ డిమాండ్‌ను ఇస్లామాబాద్ కానీ తమ అభ్యంతరాలను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

కిషన్ గంగా, రాటిల్ ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన పాకిస్తాన్.. వాటిని పరిశీలించేందుకు తటస్థ నిపుణుల కావాలని 2015లో అభ్యర్థన చేసింది..అయితే.. ఆ తర్వాత ఏడాదే ఆ అభ్యర్థనను వెనక్కి తీసుకున్న దాయాది.. మధ్యవర్తిత్వ న్యాయస్థానం తమ అభ్యంతరాలను పరిష్కరించాలని ప్రతిపాదించింది.. అయితే.. పాక్ చర్యను తీవ్రంగా వ్యతిరేకించిన భారత్.. ఈ వ్యవహారాన్ని తటస్థ నిపుణులకు అప్పగించాలని ప్రపంచ బ్యాంక్ కు అభ్యర్థన చేసింది.. ఈ పరిణామాలపై 2016లో ప్రపంచ బ్యాంక్ స్పందిస్తూ.. ఇరుదేశాల అభ్యర్థనలను నిలిపివేసింది..

ఈ సమస్యకు శాంతి యుత పరిష్కారాన్ని అన్వేషించాలని భారత్ , పాక్ కు సూచించింది.. అయితే.. పాక్ ఒత్తిడి మేరకు ఇటీవల ప్రపంచ బ్యాంక్ తటస్థ నిపుణుడి అభ్యర్థన, మధ్యవర్తిత్వ కోర్టు ప్రక్రియ రెండింటినీ ప్రారంభించింది.. దీంతో భారత్ స్పందించింది.. ఒకే అంశంపై రెండు సమాంతర చర్యలు చేపట్టడం సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని ఆరోపించింది.. ఇలాంటి ఉల్లంఘనల కారణంగానే ఒప్పందం సవరణకు నోటీసు జారీచేయాల్సి వచ్చిందని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి..

పాకిస్థాన్ ఏకపక్ష చర్య ఐడబ్ల్యూటిలోని ఆర్టికల్ 9 ద్వారా రూపొందించిన వివాద పరిష్కారం గ్రేడెడ్ మెకానిజం కు విరుద్ధంగా ఉంది. దీంతో ఈ విషయాన్ని తటస్థ నిపుణుడికి సూచించాలని వరల్డ్ బ్యాంక్‌ను భారత్ అభ్యర్థించింది. దీనిపై పాకిస్తాన్ ఒత్తిడి తేవడంతో తటస్థ నిపుణుడి అభ్యర్థన, మధ్యవర్తిత్వ కోర్టు ప్రక్రియ రెండింటిని ప్రపంచ బ్యాంక్ ప్రారంభించింది.దీనిపై స్పందించిన భారత్ ఒకే అంశంపై రెండు చర్చలు చేపట్టడం సింధు జలాల ఒప్పందం ఉల్లంఘించడమే అని ఆరోపించింది. ఈ ఉల్లంఘనల కారణంగానే ఒప్పందం సవరణకు నోటీసు జారీ చేయాల్సి వచ్చిందని భారత వర్గాలు తెలిపాయి.

సింధు జలాల ఒప్పందంపై భారత్, పాక్ లు సంతకాలు చేశాయి.. రెండు దేశాల సహకారం కొనసాగించేందుకు సింధు శాశ్వత కమీషన్ కూడా ఏర్పాటైంది.. అయితే.. పాకిస్తాన్ ఏకపక్ష నిర్ణయాలతో మొండిగా వ్యవహరిస్తోందని భారత్ దాయాది దేశానికి నోటీసులు పంపించింది.. ఈ సమస్యకు పరిష్కారం ఎప్పటికి అవుతుందో చూడాలి..

Must Read

spot_img