ఓవైపు వైసీపీ .. జయహో బీసీ అంటుంటే, బాబు సైతం బీసీలకు సబ్ ప్లాన్ అంటూ సందడి చేస్తున్నారు.. ఇక పవన్ మాత్రం .. ఎవరికి మద్ధతిచ్చినా, ఐక్యంగా ఉండండంటూ వ్యాఖ్యానించడం .. చర్చనీయాంశంగా మారింది.

ఏపీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా కానీ ఇప్పటి నుంచే అధికార-విపక్షాలన్నీ ఎన్నికల సమరంలో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు కాపు రాజకీయం మొదలైంది. ఎన్నికలు వస్తున్నాయంటేనే చాలు కొత్త కొత్త విషయాలు తెర మీదకి వస్తాయి. 2014 ఎన్నికల టైమ్ లో ప్రత్యేక హోదా కీలకంగా మారడంతో టీడీపీ అధికారాన్ని అందుకొని చంద్రబాబు కొత్త రాష్ట్రానికి తొలి సీఎం అయ్యారు. 2019 ఎన్నికల్లోనూ మళ్లీ ప్రత్యేకహోదానే పార్టీలకు ఆయువుపట్టుగా మారింది. అధికారాన్ని అందిస్తే ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం వైఖరి మారుస్తామని వైసీపీ అధినేత జగన్ చెప్పడంతో ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు.
అయితే ఇప్పుడు 2024 అసెంబ్లీ ఎన్నికలకు ప్రత్యేకహోదా పక్కన పెట్టేసి రాజధాని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అన్నిపార్టీలు దృష్టి పెట్టాయని భావించారు. కానీ ఇప్పుడు ఆ లిస్ట్ లో మరొకటి కూడా చేరింది. అదే కాపు ఓట్లు. ఏపీ రాజకీయాల్లో కాపు ఓటర్లు కీలకం. 15శాతం ఓటు బ్యాంక్ ఉండటంతో వీరి మద్దతు అన్ని పార్టీలకు అనివార్యమైంది. అయితే ఇప్పటి వరకు కాపులకు ఏ పార్టీ ఏం చేసిందన్న చర్చ మొదలైంది.
గతకొన్నేళ్లుగా కాపు వర్గం రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేస్తోంది. అయితే ఇప్పటివరకు ఏ పార్టీ కూడా రిజర్వేషన్ కల్పించడంలో విజయం సాధించలేకపోయింది. 2017లో అప్పటి సీఎం చంద్రబాబు కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించినా కేంద్రం తిరస్కరించింది. వెనకబడిన తరగతుల కింద ఆతర్వాత జనరల్ కేటగిరిలోనూ 5 శాతం రిజర్వేషన్ కోసం టీడీపీ చేసిన ప్రయత్నాలకు సుప్రీంకోర్టు సైతం అడ్డుకట్టవేసింది. అప్పటి నుంచి కాపు రిజర్వేషన్ తీరని కలగా మారిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆ అంశాన్నే హైలెట్ చేస్తోంది కాపు వర్గం. చంద్రబాబు ఓటమికి కాపురిజర్వేషన్ అమలు కాకపోవడమే కారణమన్న టాక్ వినిపించింది. అందుకే ఇప్పుడు వారిని తమవైపు తిప్పుకునేందుకు చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగానే కాపుసామాజిక వర్గానికి చెందిన జనసేన అధినేతని రంగంలోకి దింపారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ మధ్యకాలంలో పవన్ కల్యాణ్ కాపు ప్రస్తావన తరచూ తీసుకురావడమే కాకుండా వైసీపీ కాపు నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు-ఆరోపణలకు దిగుతున్నారు. జగన్ సర్కార్ కాపు సామాజిక వర్గానికి ఏం చేసిందో చెప్పాలని కూడా నిలదీశారు. అంతేకాదు జనసేన పార్టీ కాపు వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందన్న వాదనలు కూడా ఉన్నాయి. అయితే ఎన్నికల వాతావరణంలో బీసీలే టార్గెట్ గా అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

అటు టీడీపీ ఇటు జనసేనే కాదు బీజేపీ కూడా కాపు ఓట్ల కోసం కుస్తీ పడుతోంది. గత ఎన్నికల్లో జగన్ కి మద్దతుగా నిలిచిన కాపు వర్గాన్ని ఈసారి తమవైపు తిప్పుకునేందుకు కాపు రిజర్వేషన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది బీజేపీ. ఇప్పటికే ఆపార్టీ నేత కన్నాలక్ష్మీనారాయణ సీఎం జగన్ కి లేఖ కూడా రాశారు. విపక్షాలన్నీ కాపుజపం చేయడంతో అధికారపార్టీ అలర్ట్ అయ్యింది. ఇంతకుముందు ప్రభుత్వాలు చేయనివి జగన్ అధికారంలోకి వచ్చాక జరిగాయని గుర్తు చేస్తూ ఆపార్టీలోని కాపునేతలు జయహో బీసీ ఆత్మీయసమ్మేళనానికి పిలుపునిచ్చారు. కాపు నేస్తం పథకంతో మహిళలకు అందిస్తోన్న చేయూతతో పాటు అన్ని స్థాయిల్లోనూ కాపులకు ప్రాధాన్యం ఇస్తూ పదవులను కట్టబెడుతోన్న విషయాన్ని తెలిసేలా ఈ సమావేశంలో కాపు నేతలు వివరించనున్నారు. అంతేకాదు భవిష్యత్ లో కాపువర్గానికి జగన్ సర్కార్ ఏం చేయనుందన్న విషయాన్ని కూడా ప్రస్తావించనున్నారట. 2019ఎన్నికల్లో పశ్చిమగోదావరిజిల్లాలో 34 సీట్లు వైసీపీకి వచ్చాయంటే అందుకు కారణం కాపువర్గమేనన్న టాక్ ఉంది. అందుకే ఇప్పుడు ఆ ఓట్లని చీల్చేందుకు టీడీపీ-జనసేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని జగన్ సర్కార్ గుర్తించింది. దాన్ని అడ్డుకునేందుకే ఇప్పుడు జయహో బీసీ మహాసభని నిర్వహిస్తోందని రాజకీయవర్గాల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి.
రాష్ట్రంలో బీసీలకు రాజకీయ ప్రాధాన్యం భారీగా పెరిగింది. వచ్చే ఎన్నికల్లో వీరు ఎవరికి మద్దతిస్తే.. వారే అధికారంలోకి వచ్చే సూచలను స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వీరిని ఆకట్టుకునేందుకు అన్ని ప్రధాన పార్టీలూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. పూర్తిగా దిక్కులేని పరిస్థితికి చేరుకున్న కాంగ్రెస్ కూడా తాము అధికారంలోకి వస్తే.. బీసీలకు పెద్దపీట వేస్తామని, బీసీ నేతను సీఎం చేస్తామని ప్రకటించి సంచలనం సృష్టించింది. ఇక, ఇదే తరహాలో కాకపోయినా అధికార పార్టీ టీడీపీ కూడా బీసీలను ఆకట్టుకునేందుకు అనేక ప్రకటనలు గుప్పిస్తోంది. బీసీల్లో అత్యధికంగా వున్న సామాజిక వర్గాలను ప్రస్తావిస్తూ వీరందరి సంక్షేమానికి వారు కోరుకున్నట్టు గానే కార్పొరేషన్లను ప్రకటిస్తున్నట్టు సీఎం చంద్రబాబు వరాలు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవన్నీ అమలులోకి వస్తాయని పేర్కొంటూనే.. వీటన్నింటి ఫలి తంగా సుమారు మూడు వేల కోట్లు వ్యయం అవుతుందని విస్పష్టంగా ప్రకటించారు. దీంతో ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే ఆచరణ యోగ్యమైన హామీలనే సీఎం చంద్రబాబు బీసీలకు అందించారనే వాదన వినిపించింది. అంతకంటేమించి ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేస్తామని చేసిన ప్రకటన కాస్తా బీసీ వర్గాలను ఆకర్షించింది. తాజాగా బాబు చేసిన ఈ ప్రకటన బీసీవర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి బాబుకు బీసీల నుంచి మద్ధతు లభించవచ్చన్న టాక్ హాట్ టాపిక్ గా మారింది.

ఇక, వైసీపీ విషయానికి వస్తే.. బీసీలకు బాబు చేసింది ఏమీ లేదని జగన్ చెబుతున్నారు. ఆయన భారీ ఎత్తున సభలు పెట్టి వైఎస్ గతంలో బీసీలకు చేసిన మేళ్లను ఏకరువు పెడుతున్నారు. ఇక, తాను అధికారంలోకి వస్తే.. ప్రతి ఒక్కరికీ పిం ఛన్లు 45 ఏళ్ల వయసు నుంచే ఇస్తామన్నారు. 2024 ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయ సమీకరణలు మారనున్నాయి. టీడీపీ, జనసేన మధ్య దాదాపు పొత్తు ఖాయమైనట్టే. ఇటీవల చంద్రబాబు, పవన్కల్యాణ్ భేటీ అనంతరం క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన నేతలు కలిసి ప్రజాపోరాటాల్లో పాల్గొంటున్నారు. ఆ రెండు పార్టీల కలయికతో జరిగే నష్టాన్ని నివారించేందుకు వైసీపీ కొత్త వ్యూహాలను రచిస్తోంది.
పవన్కల్యాణ్ మద్దతుతో టీడీపీకి మెజార్టీ కాపు, బలిజ ఓట్లు వెళ్లే అవకాశం ఉందని వైసీపీ అంచనా వేస్తోంది. అయితే ఆ సామాజిక వర్గాన్ని వ్యతిరేకించే ఇతర కులాల ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జనాభాలో సగం ఓట్లున్న బీసీలపై వైసీపీ దృష్టి పెట్టింది. బీసీలు మొదటి నుంచి టీడీపీకి గట్టి మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం టీడీపీ బీసీల ఓట్లకు వైసీపీ గండి కొట్టింది. ఈ దఫా జనసేన, టీడీపీ కలయిక నేపథ్యంలో బీసీల ఓట్లను మరింత ఎక్కువగా తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ పకడ్బందీ వ్యూహం రచిస్తోంది. ఇప్పటికే అధికార పంపిణీలో బీసీలు, మహిళలు, మైనార్టీలు, దళితులకు జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. రానున్న రోజుల్లో మరింతగా ప్రాధాన్యం ఇస్తానని చెబుతూ, వారి
ఓట్లను రాబట్టుకునేందుకు వైసీపీ ముందుకెళుతోంది.అయితే, బీసీల విషయంలో జనసేనాని పవన్ మాత్రం ఎలాంటి ప్రకటనా చేయకపోవడం