గోవిందం సినిమాకు సీక్వెల్ రాబోతోందనే రూమర్లు గత రెండ్రోజులుగా ఎక్కువగా వినిస్తున్నాయి. అయితే ఈ విషయం మీద ఎవ్వరూ క్లారిటీ ఇవ్వలేదు. కానీ దిల్ రాజు, పరుశురామ్ విజయ్ కాంబోలో సినిమా రాబోతోందనే ప్రకటన వచ్చింది. దీంతో అది గీత గోవిందం సీక్వెల్ అని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే గీత గోవిందం సినిమాను నిర్మించింది గీతా ఆర్ట్స్ సంస్థ. ఒక వేళ దాని సీక్వెల్ తీయాలంటే ఆ సంస్థే తీయాలి.
కానీ మధ్యలో దిల్ రాజు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో వివాదం స్టార్ట్ అయింది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నిర్మాతలు అల్లు అరవింద్-దిల్ రాజు తో పాటు దర్శకుడు పరశురాం పేరు చర్చనీయాంశమైంది. గతంలో అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో పరశురామ్ గీత గోవిందం మూవీ చేశాడు. అది డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. అల్లు అరవింద్.. పరుశురాంకు అడ్వాన్స్ ఇచ్చి మరో మూవీ లాక్ చేశారట.
కానీ పరశురాంతో నెక్స్ట్ మూవీ దిల్ రాజు బ్యానర్లో విజయ్ దేవరకొండతో ప్రకటించడంతో అరవింద్ ఖంగుతిన్నాడు. అలా ప్రస్తుతం ఈ చిత్రాన్ని ప్రకటించడం ఓ కొత్త వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలోనే పరశురాం గతంలో కూడా పలు బడా బ్యానర్లు నిర్మాతల దగర ల అడ్వాన్స్ గా తీసుకున్నారని . కానీ వారితో ఒక్క సినిమా కూడా చేయకుండా హ్యాండ్ ఇచ్చారని ప్రస్తుతం ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం పరశురాం గురించి మరో తాజా వార్త బయటకు వచ్చింది.
మరో తమిళ హీరోపై కూడా అతడు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ హీరోతో సినిమా చేయాలని భావిస్తున్నాడట. తన లైన ప్ లో ప్రొడ్యూసర్స్ క్యూ కట్టడంతో వారి దగ్గర అడ్వాన్స్ అందుకున్న పరశురాం.. హీరో డేట్స్ ను నిర్మాతలే తీసుకురావాలని వారి మీదనే భారం వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలా అతడు ప్రొడ్యూసర్స్ నుంచి అడ్వాన్స్ అందుకున్నాడట. దీనిపై ఇప్పుడు చిత్రసీమలో పెద్ద చర్చే సాగుతోంది. ఇప్పటికే నిర్మాత అరవింద్ చాలా కోపంగా ఉన్నారని తెలుస్తోంది. పరుశురాం విజయ్ సినిమా విషయంలో దిల్రాజుకు-ఆయనకు మధ్య కూడా వివాదం ముదిరేలా కొనసాగుతోంది.
ఇదే విషయంలో అల్లు అరవింద్ మొన్న ప్రెస్ మీట్ కూడా ప్రకటించారు. కానీ తర్వాత ప్రొడ్యూసర్ గిల్డ్ జోక్యం చేసుకుని గొడవను తగ్గించే ప్రయత్నం చేశారు. దీంతో అరవింద్ వెనక్కి తగ్గారు. ఈ క్రమంలోనే తన తాజా ప్రాజెక్ట్ లో… గతంలో అడ్వాన్స్ ఇచ్చిన అల్లు అరవింద్ ను భాగస్వామిని చేసి కూల్ చేయాలని, వివాదం కాకుండా చూడాలని పరశురామ్ ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ఇప్పుడు అవేమీ ఫలించట్లేదని సమాచారం. పరశురాం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు అనేది ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది.