Homeఅంతర్జాతీయంజీరో కొవిడ్‌ విధానంపై భగ్గుమంటున్న చైనా.!

జీరో కొవిడ్‌ విధానంపై భగ్గుమంటున్న చైనా.!

చైనాలో 33 ఏళ్ల క్రితం ప్రభుత్వ వ్యతిరేక ప్రజా ఉద్యమం జరిగింది.. మళ్లీ ఇన్నాళ్లకు ఆ స్థాయిలో అక్కడి ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు.. జీరో కోవిడ్ విధానం పేరుతో చైనా ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు పోతోంది. దీంతో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వస్తున్నారు.. అధ్యక్షుడు, ప్రభుత్వానికి వ్యతిరేకందగా ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు.

చైనాలో ఉద్యమాలు జరగడానికి ప్రభుత్వ నియంతృత్వ పోకడలే కారణమా..?

చైనాలో 33 ఏళ్ల క్రితం ప్రజా ఉద్యమం ఎందుకు జరిగింది..? ఆ ఉద్యమాన్ని అణగదొక్కేందుకు అప్పటి ప్రభుత్వం క్రూరంగా ప్రవర్తించిందా..? ప్రస్తుతం చైనాలో జరుగుతున్న ఉద్యమాన్నిఅణచివేసేందుకు జిన్ పింగ్ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తోందా..? చైనాలో ఉద్యమాలు జరగడానికి ప్రభుత్వ నియంతృత్వ పోకడలే కారణమా..?

నాలో జీరో కోవిడ్ విధానం పేరుతో ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు పోతోంది. దీంతో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వస్తున్నారు. ఈ ప్రజా ఉద్యమాన్ని ‘ప్రజాస్వామ్య డిమాండ్’గా కూడా చూస్తున్నారు..ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి 1989లో ఒకసారి ఇలాంటి ప్రయత్నం జరిగింది. కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది… దీనికి విద్యార్థులు, యువకులు నాయకత్వం వహించారు.

దీన్ని చైనా ప్రభుత్వం సహించలేకపోయింది. ఉక్కుపాదం మోపేందుకు మార్షల్ లా విధించారు. ఈ ఉద్యమాన్ని తుపాకుల మోతతో అణిచివేశారు. వేలాది మంది నిరసనకారులు చనిపోయారు.మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి చైనాలో అదే తరహాలో తిరుగుబాటు కనిపిస్తోంది. 33 ఏళ్ల తర్వాత మరోసారి కమ్యూనిస్టు పాలనకు ప్రజలు సవాల్ విసురుతున్నారు.

ఈసారి కూడా విద్యార్థులు, యువత ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈసారి కూడా జిన్‌పింగ్‌ నేతృత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉంది.

చైనాలో ప్రజాస్వామ్యం ఎప్పుడూ లేదు.. చైనా ఒకప్పుడు బ్రిటిష్ వలసవాదం రాజ్యాల్లో ఒకటి. ఎన్నోసార్లు పోరాడిన తర్వాత 1912లో సన్ యాట్ సిన్ నేతృత్వంలో జరిగిన విప్లవం విజయవంతమై అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1931లో చైనాపై జపాన్‌ దాడి చేసింది. మావో జెడాంగ్ .. చియాంగ్ కై-షేక్ నాయకత్వంలో అంతర్గత యుద్ధం జరిగింది.

ప్రపంచ యుద్ధం జరిగింది 1945లో.. రెండో ప్రపంచ యుద్ధం ముగింపులో జపాన్ లొంగిపోయిన వెంటనే చైనా-జపనీస్ యుద్ధం కూడా ముగిసింది.చైనా దేశంలో అంతర్గత యుద్ధం కొనసాగింది.. కమ్యూనిస్టులు గెలిచారు. దీంతో 1949 అక్టోబర్ 1న మావో ప్రజాస్వామ్య పాలన గురించి ప్రస్తావించారు.

చైనా ఒకప్పుడు బ్రిటిష్ వలసవాదం రాజ్యాల్లో ఒకటి.

అయితే నేటికీ చైనా దేశంలో ప్రజాస్వామ్యం ఏర్పడలేదు. ఒకే పార్టీ, ఒకే రాజ్యాంగం. చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉంది. నేడు జీరో కావిడ్ విధానం
పేరుతో జిన్‌పింగ్ ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తున్న తీరు పౌరుల సహనానికి పరీక్ష పెట్టింది. దీంతో ఆగ్రహంతో ఉన్న యువత వీధుల్లోకి వచ్చి.. చైనా ప్రభుత్వానికి బహిరంగంగా సవాలు విసురుతున్నారు.

1989లో.. చైనాలో ప్రజలు ద్రవ్యోల్బణం.. అవినీతితో ఇబ్బంది పడ్డారు. ఏప్రిల్ 1989లో.. సంస్కరణవాద ఇమేజ్ ఉన్న కమ్యూనిస్ట్ నాయకుడు హు యావోబాంగ్ మరణించాడు. ప్రజల్లో భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన నెలకొంది. అప్పుడు ఉపాధి సంక్షోభం ఏర్పడింది. భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండేది కాదు.

బలమైన ఆర్థిక విధానాలు లేవు. రాజకీయ పార్టీ వ్యవస్థ చట్టబద్ధం చేయబడుతోంది అంటే అధికారం నియంతృత్వం వైపు పయనించడం పౌరులలో అతిపెద్ద ఆందోళన ఏర్పడింది.

అన్ని అంశాలపైనా ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది. విద్యార్థులు, యువత ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలకు పలు చోట్ల ప్రజల నుంచి అపారమైన మద్దతు లభించింది. జూన్ 2, 1989న రాజధాని బీజింగ్‌లోని తియానన్‌మెన్ స్క్వేర్ వద్ద లక్ష మందికి పైగా నిరసనకారులు ఏకమయ్యారు. సింగర్ హౌ డెజియాన్క చేరీ జరుగుతోంది. లక్షలాది మంది యువత ప్రభుత్వానికి బహిరంగంగా సవాలు విసిరారు.

ప్రజల తిరుగుబాటును అణిచివేసేందుకు చైనా ప్రభుత్వం మార్షల్ లా విధించింది. జూన్ 3, 4 మధ్య రాత్రి ఒంటిగంట నుండి, చైనా సైన్యం తియానన్‌మెన్ స్క్వేర్‌పై కాల్పులు ప్రారంభించింది. తుపాకులు, ట్యాంకులను ఉపయోగించి కాల్పులు జరిపింది. ఈ అణచివేత కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు, పౌరులు మరణించారు. చైనా ప్రభుత్వం మరణాల సంఖ్యను విడుదల చేయలేదు.. కానీ కొన్ని నివేదికల ప్రకారం, సుమారు 10,000 మంది మరణించారు.

అప్పటి నుంచి చైనాలో నిరసనలు చేపట్టడం చాలా అరుదు.. అయితే 33 సంవత్సరాల తర్వాత మరోసారి ప్రజా ఉద్యమం నేడు కనిపిస్తుంది. కమ్యూనిస్టు ప్రభుత్వానికి మరోసారి సవాల్‌ ఎదురయింది. చైనాలో కరోనా కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వ జీరో కోవిడ్ విధానం ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

చైనాలో ఒక కొత్త తరం ఆవిర్భవించింది. చాలా మంది తమ జీవితంలో తొలిసారిగా బహిరంగ నిరసనల్లో పాల్గొంటున్నారు. దాదాపు మూడేళ్లుగా అమలులో ఉన్న జీరో-కోవిడ్ విధానం నుంచి తమకు విముక్తి కావాలని వారు వీధుల్లోకి చేరి డిమాండ్ చేస్తున్నారు.

షాంఘై నిరసనలు మొదట అలజడి లేకుండానే సాగాయి. షిన్‌జియాంగ్ ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్‌ అగ్నిప్రమాదంలో చనిపోయిన మృతులకు
నివాళులు అర్పించటానికి వారు గుమిగూడారు. కోవిడ్ ఆంక్షల వల్ల.. ఆ ప్రమాద బాధితులు మంటల నుంచి తప్పించుకోలేకపోయారని చాలా మంది భావిస్తున్నారు.

దీంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య వారు సంతాపం తెలిపారు. నిరసనగా తెల్లకాగితాలను ప్రదర్శించారు. పూలు పెట్టి మౌనం పాటించారు. ఆ తర్వాత కొందరు నినాదాలు మొదలు పెట్టారు.. అనంతరం ‘‘స్వేచ్ఛ! మాకు స్వేచ్ఛ కావాలి! లాక్‌డౌన్లు తొలగించాలి’’ అని ఉద్యమబాట పట్టారు..

అధ్యక్షుడు జిన్‌పింగ్ జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు

చాలా నెలలుగా నిత్యావసర వస్తువుల కోసం చైనా ప్రజలు నిరంతరం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండేళ్లుగా లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ప్రజలలో సహనం నశించింది.

ప్రభుత్వ విధానాలు ప్రజల జీవితాలపై దారుణంగా ప్రభావితం చూపిస్తున్నాయి. ఎక్కువ మంది జీవనోపాధి కోల్పోయారు. కరోనా కారణంగా.. ప్రజలు తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. వ్యాపారం రంగంపై తీవ్ర ప్రభావం చూపించింది.. అనేక మంది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. ప్రజలు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేని దేశంలో ఇప్పుడు అధ్యక్షుడైన జిన్‌పింగ్‌ను బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు.

తిరుగుబాటును అణిచివేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది… అధ్యక్షుడు జిన్‌పింగ్ జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా జరిగిన ఈ తిరుగుబాటును అణిచివేసేందుకు, చైనా ప్రభుత్వం అనేక వ్యూహాలను అవలంబిస్తోంది. సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులు నగరాల్లో ఆందోళనకారులను అపహరిస్తున్నారు.

చైనా సెన్సార్‌షిప్ యంత్రం కూడా చురుకుగా పనిచేస్తూ.. ఉరుంకీ-షాంఘై వంటి పదాలను సెన్సార్ చేస్తోంది. నిరసనలను అణిచివేసేందుకు చైనా ప్రభుత్వం పోర్న్ సైట్లను ఆశ్రయిస్తోంది. నిరసనను శోధిస్తే, పోర్న్‌కి సంబంధించిన లింక్‌లు కనిపిస్తాయి. చైనాలో జరుగుతున్న నిరసన ప్రపంచానికి తెలియకుండా దాచడానికి.. చైనా మతతత్వ బాట్లను ఆశ్రయిస్తోంది. స్పామ్ ఖాతాలు ప్రస్తుతం అనేకం పనిచేస్తున్నాయి.

మీరు చైనాలోని బీజింగ్ లేదా షాంఘై నగరంలో సోషల్ మీడియాలో నిరసన అని సెర్చ్ చేస్తే, దానికి సంబంధించిన కంటెంట్‌కు బదులుగా, మీకు పోర్న్ వీడియోల లింక్‌లు కనిపిస్తాయి. అదే సమయంలో.. చాలా మంది వినియోగదారులు కాల్ గర్ల్స్ లేదా ఎస్కార్ట్ సేవలకు సంబంధించిన ప్రకటనలను వెలువడతాయి. చైనాలో ఉద్యమం విస్తృతంగా మారిన తర్వాత, అలాంటి ప్రకటనల వెల్లువ మొదలైంది.

కొన్ని దశాబ్దాల్లో కనిపించని ఈ రాజకీయ ప్రదర్శనలు.. వయసులో పెద్దవాళ్లయిన పరిశీలకులకు 1989 నాటి తియానాన్మెన్ స్క్వేర్ నిరసనలను గుర్తుకు తెచ్చాయి. మరింత స్వేచ్ఛాయుత చైనా కావాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఆ నిరసనలకు కూడా విద్యార్థులే సారథ్యం వహించారు.కానీ.. ఆ నిరసనలు ఎలా ముగిశాయనేది తెలియనందువల్ల ఈ తరంలో ఉద్రేకం కనిపిస్తోంది. తియానాన్మెన్ స్క్వేర్ని రసనలను చైనా హింసాత్మకంగా రక్తపాతంతో అణచివేసింది.

‘‘యుక్తవయసు ఆదర్శవాదం, బాధాకరమైన జ్ఞాపకాల భారం లేని నిర్భీతి కలగలిసి.. ఈ యువత వీధుల్లోకి వచ్చి తమ హక్కుల కోసం డిమాండ్
చేస్తున్నారు. చైనాలో 33 ఏళ్ల క్రితం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం జరిగింది.. అప్పటి ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం కాల్పులు జరపడంతో.. వేలాది మంది పౌరులు, ప్రజలు మరణించారు.

ప్రజా ఉద్యమాన్ని అణచివేసేందుకు ఎంతకైనా తెగిస్తోంది జిన్ పింగ్ ప్రభుత్వం.

Must Read

spot_img