Homeఅంతర్జాతీయంభారత్‌‌‌‌ను టార్గెట్‌ చేస్తున్న అమెరికా, చైనా, బ్రిటన్‌..

భారత్‌‌‌‌ను టార్గెట్‌ చేస్తున్న అమెరికా, చైనా, బ్రిటన్‌..

ప్రస్తుతం మన దేశానికి ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న ఆదరణ పేరు ప్రతిష్టలు చూసి అగ్రదేశాలు ఓర్చుకోలేకపోతున్నాయి. అందుకే గత కొన్ని వారాలుగా అనేక కుట్రలు రాజేస్తున్నాయి. భారత్‌‌‌‌ను టార్గెట్‌ చేస్తున్న అమెరికా, చైనా, బ్రిటన్‌ బయటకు మాత్రం మన దేశంతో బాగానే ఉన్నట్టు నటిస్తున్నాయి. కానీ లోలోపల జరగాల్సిన కుట్రలు జరిగిపోతున్నాయి. అందుకు మన దేశం ప్రతిష్టను అధికారంతో పనిలేకుండా నిలబెట్టాల్సిన కొన్ని ప్రతిపక్ష పార్టీలు శక్తివంచన లేకుండా ఈ దేశాలకు సహకరిస్తున్నాయి. తమ వంత పాత్రను అద్భుతంగా పోశిస్తున్నాయి.

మనదేశంలో జీ20 సమిట్ జరగనుందని నిర్ణయం జరిగిన రోజు నుంచి అగ్రదేశాల కంటి మీద కునుకు లేకుండా పోయింది. భారతదేశం ప్రాధాన్యత ఈ మేరకు పెరగడం అవి నిజానికి ఊహించలేదు. ఇప్పుడది రుచించడం లేదు. అందుకే ఎక్కడ వీలుంటే అక్కడ భారత ప్రధాని మోదీపై, భారతదేశంలో జరుగుతున్న అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుని ఇబ్బందికరమైన పరిస్థితులు స్రుష్టిస్తున్నాయి. అందుకు జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలను కూడా నిర్లజ్జగా వాడేసుకుంటున్నాయి. ఆనాడు స్వాతంత్య్ర సమరం సమయంలో జలియన్‌‌‌‌ వాలాబాగ్‌‌‌‌లో జనరల్‌‌‌‌ డయ్యర్‌‌‌‌ ఆదేశాల మేరకు మన సైనికులే భారతీయ వీరులపై కాల్పులు జరిపారు. దీన్ని ‘బానిస మనస్తత్వం’ అని పిలుస్తారు.

ఇపుడు కూడా అదే విధంగా మన దేశంలోని ప్రతిపక్షాలు వారి చెప్పుచేతల్లో పనిచేస్తున్నారు. అమెరికా, -చైనా,- పాకిస్థాన్‌‌‌‌, -బ్రిటన్‌‌‌‌ లాంటి దేశాలు అవకాశం దొరికినప్పుడల్లా భారత్‌‌‌‌ను టార్గెట్‌‌‌‌ చేస్తూనే ఉన్నాయి. వాళ్ల ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం అన్ని దేశాల్లో చిచ్చుపెట్టినట్లే140 కోట్ల జనాభా, ఎంతో వైవిధ్యత ఉన్న ఈ దేశంలోనూ చిచ్చుపెట్టాలని శత విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. మనదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌‌‌ కలిగిన దేశం. దానిని తమకు అనుకూలంగా చేసుకోవాలని అన్ని దేశాలూ చూస్తున్నాయి.

అందులో భాగంగా నెల రోజుల నుంచి అనేక బయటి,- లోపలి శక్తులు ‘భారత్‌‌‌‌పై’ యుద్ధం ప్రకటించాయి. ఇప్పుడు కూడా బానిస మనస్తత్వం వదులుకోలేని వ్యవస్థలు వాళ్లకు టూల్‌‌‌‌కిట్‌‌‌‌గా మారుతున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌‌‌‌లో వాళ్ల వేట నరేంద్ర మోడీ. జలియన్‌‌‌‌ వాలాబాగ్‌‌‌‌ దురంతం జరిపిన సైనికుల్లాగే ఇక్కడి ప్రతిపక్షపార్టీలు ఈ అవకాశాన్ని అదనుగా చేసుకున్నాయి. మొదటి ఉదంతం విషయానికొస్తే..ప్రధాని మోదీపై బీబీసీ వండివార్చిన డాక్యుమెంటరీతో మొదలైంది. 2002లో జరిగిన గుజరాత్‌‌‌‌ అల్లర్లను నరేంద్ర మోడీపైకి నెట్టే ప్రయత్నం చేసింది. ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేసింది. 27 ఫిబ్రవరి 2002న గోద్రా రైలులో ప్రయాణం చేస్తున్న రామభక్తుల బోగీలకు మంటబెట్టి నిర్దాక్షిణ్యంగా బూడిద చేసి చంపారు.

అందులో స్త్రీ, పురుషులు, పిల్లలతో కలిపి 59 మంది అతి దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. దానివల్ల అక్కడ మతఘర్షణలు జరిగాయి. దాన్ని ప్రపంచ వ్యాప్తంగా వివాదం చేసి మోడీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరిగింది. కొన్ని దేశాలు ఇప్పుడు మోడీకి రెడ్‌‌‌‌ కార్పెట్‌‌‌‌ పరుస్తున్నాయి కానీ ఆనాడు ఆయనకు విజిట్ వీసా కూడా ఇవ్వలేదు. ఈ అల్లర్లకు మోడీయే కారణం అని దేశంలోని అన్ని సూడో సెక్యులర్‌‌‌‌ పార్టీలు గొడవ చేసి మోడీకి పరోక్షంగా చక్కని ప్రచారం కల్పించాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నందున ఆ విషయాన్ని నెగెటివ్‌‌‌‌గా ప్రచారం చేసేందుకు మరోసారి బీబీసీ ఈ డాక్యుమెంట్‌‌‌‌ రూపొందించింది. అయితే ప్రతిపక్షాలు దీన్ని గొప్ప వరంగా భావించి ప్రచారంలోకి దూకాయి. ఈ డాక్యుమెంటరీని భారత్‌‌‌‌ నిషేధించింది. కేరళలోని కొన్నూర్‌‌‌‌ వర్సిటీ, త్రివేండ్రం లా కాలేజీ, హైదరాబాద్‌‌‌‌ సెంట్రల్‌‌‌‌ యూనివర్సిటీలోని వామపక్ష, కాంగ్రెస్‌‌‌‌ విద్యార్థి సంస్థలు ప్రదర్శనకు పెట్టారు. జేఎన్‌‌‌‌యూలో కూడా అలాంటి ప్రయత్నం జరిగింది. బీబీసీ డాక్యుమెంట్‌‌‌‌ను ప్రభుత్వం నిషేధించినా ‘డాక్‌‌‌‌వెబ్‌‌‌‌’ లాంటి వాటి ద్వారా డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకొని ఈ దుస్సాహసానికి ఈ సంస్థలు పూనుకున్నాయి.

అయితే ఈ డాక్యుమెంట్‌‌‌‌లో పచ్చి అబద్ధాలు ప్రచారం చేసిన బీబీసీకి భారత్‌‌‌‌పై విషం కక్కడం ఇదేమీ కొత్త కాదు. గతంలో 1970లో ఈ దేశంలోని సంస్కృతిని, ఇతర రాజకీయ విషయాలను హేళన చేస్తూ డాక్యుమెంటరీలు రూపొందించింది. 1970-–72 మధ్య ప్రధాని ఇందిర కాలంలోనే రెండుసార్లు నిషేధానికి గురైంది. విచిత్రం ఏమిటంటే బీబీసీని మనదేశ అత్యున్నత న్యాయ స్థానాల కన్నా గొప్పగా చూసే సంస్థల బేలతనం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. గుజరాత్‌‌‌‌ అల్లర్లపై కాంగ్రెస్‌‌‌‌ నేత యయసాన్‌‌‌‌ జాఫ్రీ భార్య జాకీయా జాఫ్రీ ఫిర్యాదుతో నాటి గుజరాత్‌‌‌‌ సీఎం మోడీ, ఆయన మంత్రులు, నేతలపై కేసు నమోదైంది. ఆ తర్వాత 2006 జూన్‌‌‌‌లో నాటి యూపీఏ ప్రభుత్వం సుప్రీం ఆదేశాలతో ఆర్‌‌‌‌కె రాఘవన్‌‌‌‌ నేతృత్వంలో సిట్‌‌‌‌ ఏర్పాటు చేసింది. 2008లో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌‌‌‌ ఆధారంగా రెండేళ్లు విచారణ జరిగింది. 2010లో సిట్‌‌‌‌ గాంధీనగర్‌‌‌‌ కార్యాలయానికి మోడీ వెళ్లి సాధారణ వ్యక్తిలా విచారణ ఎదుర్కొన్నాడు. సుమారు 9 గంటలపాటు108 ప్రశ్నలతో సిట్‌‌‌‌ మోడీని ప్రశ్నించింది. 8 ఫిబ్రవరి 2012న మోడీకి క్లీన్‌‌‌‌చిట్‌‌‌‌ లభించింది.

2017లో గుజరాత్‌‌‌‌ హైకోర్టు, 2022లో సుప్రీంకోర్టు సిట్‌‌‌‌ పరిశోధన ఆధారంగా ఈ అల్లర్లకు సంబంధించి నరేంద్రమోడీకి ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశాయి. అయినా ఈ దేశంలో మేధావులు, అర్బన్‌‌‌‌ నక్సల్స్‌‌‌‌ మోడీని టార్గెట్‌‌‌‌ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనదేశ దర్యాప్తు సంస్థల కన్నా విదేశీ సంస్థలను బాగా నమ్మే ‘బ్రేకింగ్‌‌‌‌ ఇండియా ఫోర్సెస్‌‌‌‌’ ఈ విషయంలో బీబీసీని పరమ ప్రామాణికంగా చేసుకొని మరోసారి విషం కక్కుతున్నాయి. అయితే ఈ అంశం ప్రజల్లోకి వెళ్లగానే గుజరాత్‌‌‌‌ అల్లర్ల వెనుక జరిగిన దుర్మార్గం, గోద్రా హత్యాకాండను ప్రశ్నించగానే ఇది జాతీయ దృక్కోణంలోకి వెళ్లి అంతిమంగా మోడీకి లాభం అవుతుందని భావించి ఈ ఫోర్సెస్‌‌‌‌ వెనక్కి తగ్గాయి. గత ఎన్నికల ముందు ఈవీఎంల టాంపరింగ్‌‌‌‌ అంటూ కపిల్‌‌‌‌ సిబాల్‌‌‌‌ ఎలా అయితే దుష్ప్రచారం చేశారో ఇప్పుడూ అలాగే బీబీసీని వాడుదామంటే అది బెడిసికొట్టింది.

తాజాగా 1బిలియన్‌‌‌‌ డాలర్లు గ్లోబల్‌‌‌‌ యూనివర్సిటీ పేరుతో ఖర్చుపెట్టి జాతీయవాదంపై యుద్ధం చేయమంటూ అమెరికా వ్యాపారవేత్త బిలియనియర్ సారోస్‌‌‌‌ రెచ్చగొట్టాడు. ప్రస్తుతం ఈ అంశం మరోసారి లడ్డూలా ప్రతిపక్షాలకు దొరికింది. అదను చూసి అమెరికా వ్యాపార దిగ్గజం జార్జ్‌‌‌‌సారోస్‌‌‌‌ను రంగంలోకి దించారు. 92 ఏళ్ల సారోస్ హంగరీలో పుట్టి అమెరికాలో వ్యాపారం చేస్తూన్నారు. భారత వ్యతిరేక శక్తుల ప్రోద్బలంతో నేరుగా మోడీపై పడ్డారు. గతంలో అమెరికా ఇరాక్‌‌‌‌లో సద్దాం హుస్సేన్‌‌‌‌ను, లిబియాలో మహమ్మద్‌‌‌‌ గఢాఫీలను ప్రజాందోళన చేయించి చంపేసినట్లే భారతదేశంలోనూ జనాన్ని ప్రతిపక్షాలతో ఏదో చేయించాలనే కుట్ర వర్కవుట్ అయ్యే అవకాశం లేదు. దేశప్రజలలో చక్కని చైతన్యం ఉంది.

భారత్ ఎన్నడూ ఇరాక్, లిబియా లాంటి దేశంగా ఉండదు గాక ఉండదు. అటు కాశ్మీర్‌‌‌‌లో ఆర్టికల్‌‌‌‌370 ఎత్తేశాక, సీఏఏ చట్టం వచ్చాక ఇలాంటి కుట్ర చేసినా అది ఫలించలేదు. గౌతమ్‌‌‌‌ అదానీ విషయంలోనే మోడీ 2024లో ఓడిపోయి భారత్‌‌‌‌లో ప్రజాస్వామ్యం వస్తుందని ప్రస్తుతం జార్జ్ సారోస్ కారుకూతలు కూశారు. జర్మనీలో జరిగిన ‘మ్యూనిచ్ సెక్యూరిటీ కౌన్సిల్‌‌‌‌’లో జార్జ్‌‌‌‌ సారోస్‌‌‌‌ భారత్‌‌‌‌పై విషం కక్కారు. ‌‌‌1984 నుంచి ‘ఓపెన్‌‌‌‌ సొసైటీ ఫౌండేషన్‌‌‌‌’ పేరుతో ఓ ఎన్జీవో నడుపుతున్నారు సారోస్.. ఈ సంస్థ సాయం పేరుతో 120 దేశాల్లో ఆ దేశాల వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తోంది. 8.5 బిలియన్‌‌‌‌ యూఎస్‌‌‌‌ డాలర్లతో నడిచే ఈ సంస్థ మనదేశంలోని తుక్డే తుక్డే గ్యాంగ్‌‌‌‌లకు సాయం చేస్తూ వస్తోంది. వివిధ దేశాలను బలహీనపరిచేందుకు 70 దేశాల్లో సారోస్‌‌‌‌ ఎన్జీవో తీవ్రంగా పనిచేస్తుంటుంది. 2016లో భారత ప్రభుత్వం ఎన్నికల అక్రమ నిధుల అడ్డుకట్టలో భాగంగా ఈ సంస్థను నిఘా పరిధిలోకి చేర్చింది. అప్పటి నుంచి భారత్‌‌‌‌పై కుట్రకు ఈ సంస్థ తెరలేపింది.

అయితే భారత్‌‌‌‌ లాంటి వైవిధ్యభరిత, అతిపెద్ద దేశంలో ఈ కుట్రలు ఫలిస్తే మాత్రం దేశ ప్రజలకు ప్రమాదం తప్పదు.

Must Read

spot_img